Nandyal | నంద్యాల డైరీ పీఠం కోసం కుటుంబాల మధ్య పోరు..

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nandyal | నంద్యాల విజయ డైరీ పీఠం కోసం కుటుంబాల మ‌ధ్య అధికార పోరు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌ర్నూలు జిల్లాలో పేరున్న భూమా, ఎస్వీ కుటుంబాలు డైరీ వ్య‌వ‌హారంలో పోటీప‌డ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఏళ్ల తరబడి స్నేహబంధాలతో కొనసాగిన రెండు ప్రభావశీల కుటుంబాల మధ్య ఇప్పుడు పదవి కోసం విభేదాలు బయటపడుతున్నాయి. నంద్యాల (Nandyal) సహకార పాల డైరీ ఛైర్మన్ కుర్చీ చుట్టూ చెలరేగిన ఈ వివాదం కుటుంబ పరిమితులను దాటి రాజకీయ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nandyal | నంద్యాల విజయ డైరీ పీఠం కోసం కుటుంబాల మ‌ధ్య అధికార పోరు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌ర్నూలు జిల్లాలో పేరున్న భూమా, ఎస్వీ కుటుంబాలు డైరీ వ్య‌వ‌హారంలో పోటీప‌డ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

ఏళ్ల తరబడి స్నేహబంధాలతో కొనసాగిన రెండు ప్రభావశీల కుటుంబాల మధ్య ఇప్పుడు పదవి కోసం విభేదాలు బయటపడుతున్నాయి. నంద్యాల (Nandyal) సహకార పాల డైరీ ఛైర్మన్ కుర్చీ చుట్టూ చెలరేగిన ఈ వివాదం కుటుంబ పరిమితులను దాటి రాజకీయ వేడెక్కింపుగా మారింది. పదవే ప్రాధాన్యంగా మారడంతో మామ–కోడలి మధ్య ప్రత్యక్ష పోరు మొదలైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పేరున్న భూమా, ఎస్వీ కుటుంబాలు ఈ డైరీ వ్యవహారంలో ఎదురెదురుగా నిలబడ్డాయి. గతంలో ఎక్కువకాలం భూమా కుటుంబ సభ్యులే ఛైర్మన్ బాధ్యతలు నిర్వర్తించగా, ఇటీవల వైసీపీ ప్రభుత్వ కాలంలో ఎస్వీ జగన్మోహన్ రెడ్డి ఆ పదవిలో కొనసాగుతున్నారు. తాజా రాజకీయ మార్పుల నేపథ్యంలో మళ్లీ ఆ కుర్చీని సొంతం చేసుకోవాలని భూమా వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం.

Nandyal | కుటుంబాల మ‌ధ్య పోరు

ఈ క్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ (Akhila Priya) కీలకంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.ఈ పోరులో ఆరోపణలు–ప్రత్యారోపణలు తీవ్రతరం అయ్యాయి. డైరీ ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు, పాత బకాయిలు వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. ఒకవైపు ఛైర్మన్‌పై అక్రమాలు జరిగాయని భూమా వర్గం ఆరోపిస్తుండగా, మరోవైపు తమపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు చూపాలని ఛైర్మన్ వర్గం సవాల్ విసురుతోంది. బకాయిల చెల్లింపుల అంశమే ఈ వివాదానికి మూలమని చెబుతూ, రాజకీయ కక్షతోనే కేసులు పెట్టిస్తున్నారని ఛైర్మన్ వర్గం వాదిస్తోంది.ఇదిలా ఉండగా, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల ప్రక్రియ కూడా వివాదాస్పదంగా మారింది. కొన్ని చోట్ల నామినేషన్లపై భిన్న ప్రకటనలు రావడంతో అధికారుల తీరుపై ప్రశ్నలు తలెత్తాయి.

ఏకగ్రీవ ఎన్నికల Elections ప్రకటనపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా, ఎన్నికల నిర్వహణలో పక్షపాతం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంతో డైరీ పరిధిలోని సంఘాల ఎన్నికలు మరింత ఉత్కంఠగా మారాయి. ఇప్పటికే ఐదు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన ఒక విడత ఫలితాలు ఛైర్మన్ పీఠం ఎవరి వశం అవుతుందనే దానిపై కీలక ప్రభావం చూపనున్నాయి. రాజకీయ పార్టీలు కూడా ఈ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నంద్యాల జిల్లా రాజకీయ వాతావరణం హీట్ ఎక్కుతోంది. చివరకు డైరీ ఛైర్మన్ కుర్చీ ఎవరి చేతికి చేరుతుందన్నది వేచి చూడాల్సిందే.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...