Hyderabad KPHB | ప్రేమించిన యువతి దక్కలేదని.. పెళ్లి చేసుకున్నోడిని ఖతం చేసిండు

అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad KPHB : తను ప్రేమించిన యువతిని తనకు కాకుండా వేరే యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడంతో కక్ష పెంచుకున్న భగ్న ప్రేమికుడు.. తన ప్రేయసిని వివాహమాడిన వ్యక్తిని హతమార్చాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని కూకట్​పల్లిలో చోటుచేసుకుంది. కేపీహెచ్​బీ పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh లోని తూర్పు గోదావరి జిల్లా East Godavari district అడవిపూడికి చెందిన అన్నదమ్ములు మేడిశెట్టి జగదీశ్, దుర్గాప్రసాద్ తమ కుటుంబాలతో కలిసి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్​కు […]

అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad KPHB : తను ప్రేమించిన యువతిని తనకు కాకుండా వేరే యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడంతో కక్ష పెంచుకున్న భగ్న ప్రేమికుడు.. తన ప్రేయసిని వివాహమాడిన వ్యక్తిని హతమార్చాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని కూకట్​పల్లిలో చోటుచేసుకుంది.

కేపీహెచ్​బీ పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh లోని తూర్పు గోదావరి జిల్లా East Godavari district అడవిపూడికి చెందిన అన్నదమ్ములు మేడిశెట్టి జగదీశ్, దుర్గాప్రసాద్ తమ కుటుంబాలతో కలిసి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్​కు వచ్చి సర్దార్​ పటేల్​ నగర్​ Sardar Patel Nagar లో ఉంటున్నారు.

దుర్గాప్రసాద్ మరదలు శ్రావణి సంధ్య వీళ్లతోనే ఉంటోంది. అడవిపూడికే చెందిన పంపైన అయ్యప్పస్వామి అలియాస్ పవన్​కుమార్ ఇదే కాలనీలో ఉంటూ ఆటోడ్రైవర్​గా పనిచేస్తున్నాడు. కాగా, తను శ్రావణిసంధ్యను ప్రేమిస్తున్నానని, తనకిచ్చి పెళ్లి చేయాలని కొన్నేళ్ల కింద ఆమె కుటుంబ సభ్యులను కోరాడు. అందుకు వారు సమ్మతించలేదు. అయితే, అదే కాలనీలో ఉంటూ ఆటో నడుపుకొనే కళ్ల వెంకటరమణ(30)కు సంధ్యను ఇచ్చి వివాహం చేశారు.

దీంతో కక్ష పెంచుకున్న పవన్ కుమార్ తరచూ వెంకటరమణ, అతడి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే వెంకటరమణను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తన స్నేహితుల సాయం కోరాడు.

శ్రావణి సంధ్య మూడు రోజుల కింద ఊరికి వెళ్లింది. దీంతో వెంకటరమణ భోజనానికి జగదీశ్ ఇంటికి వచ్చేవాడు. దీనిని గమనించిన పవన్​కుమార్ ఆదివారం అర్ధరాత్రి 12.20 గంటలకు తన నలుగురు స్నేహితులతో కలిసి జగదీశ్ ఇంటి సమీపంలోకి చేరుకున్నారు. అక్కడ పెద్దగా అరవడం మొదలుపెట్టారు.

ఇది గమనించిన జగదీశ్ బయటకు వచ్చి వారిని మందలించాడు. ఈ క్రమంలో పవనకుమార్, అతడి స్నేహితులు గొడవకు దిగారు. దీంతో స్థానికులను పిలిచేందుకు జగదీశ్ అక్కడి నుంచి వెళ్లగా.. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం.. ఐదుగురు కలిసి కత్తులతో వెంకటరమణ ఛాతిలో పొడిచి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ వెంకటరమణ అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...