Madras High Court | ఉదయనిధి స్టాలిన్​కు హైకోర్టులో చుక్కెదురు..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madras High Court | తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)​కు మద్రాస్​ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు విద్వేష ప్రసంగం అని పేర్కొంది. ఉదయనిధి స్టాలిన్​ 2023లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డెంగీ, మలేరియాతో పోలుస్తూ.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్నారు. అయితే దానిపై హిందూ సంఘాలు, బీజేపీ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madras High Court | తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)​కు మద్రాస్​ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు విద్వేష ప్రసంగం అని పేర్కొంది.

ఉదయనిధి స్టాలిన్​ 2023లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డెంగీ, మలేరియాతో పోలుస్తూ.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్నారు. అయితే దానిపై హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు (BJP Leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తమిళనాడు పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయితే ఆయన వ్యాఖ్యాలను విమర్శిస్తూ సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ చేసినందుకు బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవ్య (Amit Malviya)పై కేసు నమోదు చేశారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మాలవ్యపై నమోదైన కేసును కొట్టేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

Madras High Court | వారిని వదిలేస్తున్నారు..

విద్వేషపూరిత ప్రసంగాలను ప్రారంభించిన వారిని స్వేచ్ఛగా వదిలేసి, అటువంటి ప్రసంగాలపై స్పందించిన వారిపై కేసులు నమోదు చేయడం సరికాదని కోర్టు తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో కొన్ని కేసులు నమోదైనప్పటికీ, తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్​పై ఎలాంటి కేసు నమోదు కాలేదని కూడా హైకోర్టు ఎత్తి చూపింది. ఉదయనిధి స్టాలిన్ ఉపయోగించిన పదజాలం జాతి నిర్మూలనను సూచిస్తుందని, విద్వేషపూరిత ప్రసంగం కిందకు వస్తుందని స్పష్టం చేసింది. ‘సనాతన ఒళిప్పు’ అనే తమిళ పదబంధం స్పష్టంగా జాతి నిర్మూలన లేదా సాంస్కృతిక నిర్మూలన అని అర్థం అని పేర్కొంది. ఇటువంటి పరిస్థితులలో మంత్రి ప్రసంగాన్ని ప్రశ్నిస్తూ పిటిషనర్ చేసిన పోస్ట్ విద్వేషపూరిత ప్రసంగం కిందకు రాదని స్పష్టం చేసింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...