Sangareddy | సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న తుఫాన్ వాహనం, ఒకరు స్పాట్‌ డెడ్​..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sangareddy | సంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంది మండల పరిధిలోని చేర్యాల గేటు వద్ద ఆర్టీసీ బస్సును (RTC bus) వేగంగా దూసుకొచ్చిన తుఫాన్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నారాయణఖేడ్‌ చాంద్‌ఖాన్‌పల్లి గ్రామానికి చెందిన బాలయ్య (52) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. Sangareddy | ఘోర ప్ర‌మాదం.. సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి (SI […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sangareddy | సంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంది మండల పరిధిలోని చేర్యాల గేటు వద్ద ఆర్టీసీ బస్సును (RTC bus) వేగంగా దూసుకొచ్చిన తుఫాన్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నారాయణఖేడ్‌ చాంద్‌ఖాన్‌పల్లి గ్రామానికి చెందిన బాలయ్య (52) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Sangareddy | ఘోర ప్ర‌మాదం..

సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి (SI Madhusudhan Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. తూప్రాన్ మండలం అల్లాపూర్‌కు చెందిన ప్రవీణ్, న్యాల్కల్ మండలం రత్నపూర్ గ్రామానికి చెందిన ఫరీద్, సిర్గాపూర్‌కు చెందిన సీతారాం, రాయచూరు ప్రాంతానికి చెందిన కాలప్పతో పాటు తుఫాన్ వాహనంలో ఉన్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదం తీవ్రతకు తుఫాన్ వాహనం పూర్తిగా ధ్వంసమై నుజ్జునుజ్జయింది.

అత్యవసరంగా స్పందించిన పోలీసులు క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి (Sangareddy Government Hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆ ప్రాంత ప్రజలు ప్రమాద స్థలానికి చేరుకోవ‌డంతో రోడ్డు రవాణా తాత్కాలికంగా నిలిచిపోయినట్లు సమాచారం. అయితే పోలీసులు వాహనాలను పక్కకు తరలించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...