SP Kamareddy | అంతర్రాష్ట్ర షట్టర్ లిఫ్టింగ్ దొంగల ముఠాలో ఇద్దరి అరెస్ట్..

అక్షరటుడే, కామారెడ్డి : SP Kamareddy | జిల్లాలో షట్టర్లు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర షట్టర్ లిఫ్టింగ్ దొంగల ముఠా సభ్యుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్​ అయిన ఇద్దరు కూడా మైనర్లు కావడం గమనార్హం. ముఠా అరెస్ట్​కు సంబంధించిన వివరాలను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర (SP Rajesh Chandra) వెల్లడించారు. SP Kamareddy | నాలుగు షట్టర్లు ధ్వంసం చేసి.. కామారెడ్డి […]

అక్షరటుడే, కామారెడ్డి : SP Kamareddy | జిల్లాలో షట్టర్లు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర షట్టర్ లిఫ్టింగ్ దొంగల ముఠా సభ్యుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్​ అయిన ఇద్దరు కూడా మైనర్లు కావడం గమనార్హం. ముఠా అరెస్ట్​కు సంబంధించిన వివరాలను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర (SP Rajesh Chandra) వెల్లడించారు.

SP Kamareddy | నాలుగు షట్టర్లు ధ్వంసం చేసి..

కామారెడ్డి పట్టణంలో ఈనెల 8న నాలుగు షట్టర్లు పగులగొట్టి చోరీలకు పాల్పడటంతో పాటు రెండు బైక్​లు చోరీకి గురైన ఘటనపై జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈనెల 13న మరోసారి కామారెడ్డికి (Kamareddy) వచ్చినట్టుగా గుర్తించిన పోలీసులు సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో నిఘా వేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను పట్టుకున్నారు. వారిని విచారించగా నలుగురు ముఠా సభ్యులుగా ఏర్పడి రాత్రి పూట, తెల్లవారుజామున ఎవkp లేని సమయంలో మెయిన్ రోడ్లపై తాళం వేసి ఉన్న దుకాణాలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నట్టుగా తేలింది.

SP Kamareddy | ఇద్దరు కాపాలాగా ఉంటే..

చోరీల సమయంలో నిందితులు ఇద్దరు కాపలాగా ఉంటే.. మిగిలిన వారు మాస్కులు, గ్లౌజులు ధరించి ఇనుప రాడ్లతో షటర్లను పైకిలేపి లోపలికి ప్రవేశించి నగదు, వస్తువులు దొంగిలించి ముందుగా సిద్ధంగా ఉంచుకున్న బైక్​లపై పారిపోతున్నట్టుగా విచారణలో వెల్లడైంది. నలుగురిలో మహారాష్ట్ర (Maharashtra) హింగోలి జిల్లాకు చెందిన ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. మరొక ఇద్దరిలో ఏ1 సోను పిరాజ్ పవార్, ఏ2 అనికేతన్ జాదవ్​లు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. సోను పిరాజ్ అనేక మందిని ముఠాలుగా ఏర్పాటు చేసినట్టుగా తెలిసిందన్నారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామన్నారు. అరెస్టయిన వారి వద్ద నుంచి బైక్​, ఇనుప రాడ్లు, మాస్కులు, గ్లౌజులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. జిల్లాలో అనుమానాస్పద వ్యక్తులు కనపడితే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. సమావేశంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy), సీసీఎస్ ఇన్​స్పెక్టర్ శ్రీనివాస్, పట్టణ సీఐ నరహరి పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...