Homeతాజావార్తలుHyderabad | ఆటోలో ఇద్దరి మృతదేహాలు.. డ్రగ్స్​ ఓవర్​ డోస్​తో మృతి!

Hyderabad | ఆటోలో ఇద్దరి మృతదేహాలు.. డ్రగ్స్​ ఓవర్​ డోస్​తో మృతి!

చంద్రాయణ​గుట్టలో ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం రేపాయి. డ్రగ్స్​ ఓవర్​ డోస్​తో వారు మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో డ్రగ్స్​, గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎంతో మంది వీటికి బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

నగరంలోని చంద్రాయణగుట్ట (Chandrayangutta)లో ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం రేపాయి. ఫ్లైఓవర్ కింద నిలిపి ఉన్న ఆటోలో మృతదేహాలు కనిపించాయి. మృతులు జహంగీర్, ఇర్ఫాన్‌గా గుర్తించారు. ఆటోలో మూడు ఇంజెక్షన్లను పోలీసులు గుర్తించారు. వారు డ్రగ్స్​ తీసుకున్నట్లు అనుమానం. డ్రగ్స్​ ఓవర్​ డోస్​ కావడంతోనే మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు డ్రగ్స్​ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా (Osmania)కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad | రాజేంద్రనగర్​లో..

నగరంలోని రాజేంద్రనగర్ (Rajendranagar)​లో గత నెలలో ఓ వ్యక్తి డ్రగ్స్​ ఓవర్​ డోస్​తో ఓ యువకుడు మృతి చెందాడు. అహ్మద్​ అలీ మొబైల్​ టెక్నీషియన్​గా పని చేసేవాడు. స్థానికంగా ఓ అపార్ట్​మెంట్​లో అలీ మరో ముగ్గురితో కలిసి డ్రగ్స్​ పార్టీ చేసుకున్నాడు. ఇందులో ఇద్దరు యువతులు ఉన్నారు. అయితే డ్రగ్స్​ ఓవర్​ డోస్​ కావడంతో అలీకి తీవ్ర రక్తస్రావం అయి చనిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే పోలీసులు రాగానే యువతులు పారిపోయేందుకు యత్నించారు. వారిని పట్టుకొని డ్రగ్స్​ టెస్ట్​ చేశారు. ముగ్గురికి డ్రగ్స్​ పాజిటివ్​గా నిర్ధారణ అయింది.

Hyderabad | జోరుగా డ్రగ్స్​ దందా

రాష్ట్రంలో డ్రగ్స్​ దందా జోరుగా సాగుతోంది. మహా నగరం హైదరాబాద్​ పాటు మారుమూల ప్రాంతాల్లో సైతం గంజాయి లభిస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా 16 నుంచి 25 ఏళ్లలోపు యువత దీనికి ఎక్కువగా బానిసలుగా మారుతున్నారు. పోలీసులు, ఈగల్​ టీమ్​ (Eagle Team) చర్యలు చేపడుతున్నా.. డ్రగ్స్​ దందా ఆగడం లేదు. పోలీసులు డ్రగ్స్​ నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. అయినా దానికి బానిసలుగా మారిన యువత మారడం లేదు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. డ్రగ్స్​, గంజాయికి బానిస అయినట్లు గుర్తిస్తే డి అడిక్షన్​ సెంటర్​కు తరలించాలి.

Must Read
Related News