Hyderabad | ఆటోలో ఇద్దరి మృతదేహాలు.. డ్రగ్స్​ ఓవర్​ డోస్​తో మృతి!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో డ్రగ్స్​, గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎంతో మంది వీటికి బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. నగరంలోని చంద్రాయణగుట్ట (Chandrayangutta)లో ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం రేపాయి. ఫ్లైఓవర్ కింద నిలిపి ఉన్న ఆటోలో మృతదేహాలు కనిపించాయి. మృతులు జహంగీర్, ఇర్ఫాన్‌గా గుర్తించారు. ఆటోలో మూడు ఇంజెక్షన్లను పోలీసులు గుర్తించారు. వారు డ్రగ్స్​ తీసుకున్నట్లు అనుమానం. డ్రగ్స్​ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో డ్రగ్స్​, గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎంతో మంది వీటికి బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

నగరంలోని చంద్రాయణగుట్ట (Chandrayangutta)లో ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం రేపాయి. ఫ్లైఓవర్ కింద నిలిపి ఉన్న ఆటోలో మృతదేహాలు కనిపించాయి. మృతులు జహంగీర్, ఇర్ఫాన్‌గా గుర్తించారు. ఆటోలో మూడు ఇంజెక్షన్లను పోలీసులు గుర్తించారు. వారు డ్రగ్స్​ తీసుకున్నట్లు అనుమానం. డ్రగ్స్​ ఓవర్​ డోస్​ కావడంతోనే మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు డ్రగ్స్​ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా (Osmania)కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad | రాజేంద్రనగర్​లో..

నగరంలోని రాజేంద్రనగర్ (Rajendranagar)​లో గత నెలలో ఓ వ్యక్తి డ్రగ్స్​ ఓవర్​ డోస్​తో ఓ యువకుడు మృతి చెందాడు. అహ్మద్​ అలీ మొబైల్​ టెక్నీషియన్​గా పని చేసేవాడు. స్థానికంగా ఓ అపార్ట్​మెంట్​లో అలీ మరో ముగ్గురితో కలిసి డ్రగ్స్​ పార్టీ చేసుకున్నాడు. ఇందులో ఇద్దరు యువతులు ఉన్నారు. అయితే డ్రగ్స్​ ఓవర్​ డోస్​ కావడంతో అలీకి తీవ్ర రక్తస్రావం అయి చనిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే పోలీసులు రాగానే యువతులు పారిపోయేందుకు యత్నించారు. వారిని పట్టుకొని డ్రగ్స్​ టెస్ట్​ చేశారు. ముగ్గురికి డ్రగ్స్​ పాజిటివ్​గా నిర్ధారణ అయింది.

Hyderabad | జోరుగా డ్రగ్స్​ దందా

రాష్ట్రంలో డ్రగ్స్​ దందా జోరుగా సాగుతోంది. మహా నగరం హైదరాబాద్​ పాటు మారుమూల ప్రాంతాల్లో సైతం గంజాయి లభిస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా 16 నుంచి 25 ఏళ్లలోపు యువత దీనికి ఎక్కువగా బానిసలుగా మారుతున్నారు. పోలీసులు, ఈగల్​ టీమ్​ (Eagle Team) చర్యలు చేపడుతున్నా.. డ్రగ్స్​ దందా ఆగడం లేదు. పోలీసులు డ్రగ్స్​ నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. అయినా దానికి బానిసలుగా మారిన యువత మారడం లేదు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. డ్రగ్స్​, గంజాయికి బానిస అయినట్లు గుర్తిస్తే డి అడిక్షన్​ సెంటర్​కు తరలించాలి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...