truck and car collided : ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్ – కారు ఢీ.. నలుగురి దుర్మరణం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: truck and car collided : కారు, కంటైనర్​ ఢీ కొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో చోటుచేసుకుంది. సత్ ఫూల్ వంతెన వద్ద కంటైనర్​ను వెనుక నుంచి కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న వేగానికి  కారు నుజ్జునుజ్జు అయింది. వేగం ఎక్కువగా ఉండటంతో కారులో డ్రైవర్​తోపాటు మరో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: truck and car collided : కారు, కంటైనర్​ ఢీ కొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో చోటుచేసుకుంది. సత్ ఫూల్ వంతెన వద్ద కంటైనర్​ను వెనుక నుంచి కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న వేగానికి  కారు నుజ్జునుజ్జు అయింది. వేగం ఎక్కువగా ఉండటంతో కారులో డ్రైవర్​తోపాటు మరో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నారు.

truck and car collided : కొత్తగా ఎన్నికైన సర్పంచికి గాయాలు

హైదరాబాద్​లోని రెయిన్ బో హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న తమ బందువులను మాట్లాడించి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్​కు తరలించారు. మృతులు కుబీర్ మండలంలోని కుష్టి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు.. మృతులను బాబన్న (70), రాజన్న(60), భోజరం పటేల్(42), డ్రైవర్ వికాస్​గా పోలీసులు గుర్తించారు. కారులో ఉన్న ఇటీవల ఎన్నికైన సర్పంచి గంగాధర్ తలకు కూడా గాయాలయ్యాయి. ఆయన్ను భైంసా ఆసుపత్రికి అక్కడి నుంచి నిజామాబాద్​కు తరలించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...