Kamareddy | విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలి

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | హాస్టల్ నుంచి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలని విద్యార్థి సంఘాల నాయకులు (Student Union Leaders) అధికారులను కోరారు. ఈ మేరకు బీసీ, టీజేఎస్, గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు ప్రజావాణి (Prajavani)లో కలెక్టరేట్ ఏవోకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీ (NGOs Colony) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న సుమారు 50 […]

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | హాస్టల్ నుంచి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలని విద్యార్థి సంఘాల నాయకులు (Student Union Leaders) అధికారులను కోరారు. ఈ మేరకు బీసీ, టీజేఎస్, గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు ప్రజావాణి (Prajavani)లో కలెక్టరేట్ ఏవోకు సోమవారం వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీ (NGOs Colony) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న సుమారు 50 మంది విద్యార్థినులు ఎస్సీ, ఎస్టీ ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లలో ఉంటున్నారని  తెలిపారు.సంబంధిత విద్యార్థినులు హాస్టల్ నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్నారని, మార్గమధ్యంలో సాయంత్రం రద్దీగా ఉండే రోడ్డు దాటుకుని వెళ్లాల్సి వస్తుందన్నారు.

ఆ సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. విద్యార్థినుల భద్రతా దృష్ట్యా రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సభావత్ వినోద్ చౌహన్ పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...