Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో​ సెక్యూరిటీ సిబ్బందిగా ట్రాన్స్​జెండర్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Metro | సమాజంలో వివక్ష గురి అవుతున్న ట్రాన్స్​జెండర్లకు ఉపాధి విషయంలో ఇటీవల ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపుతున్నాయి. వారికి ఉద్యోగాలు, వ్యాపారాల్లో అవకాశాలు కల్పిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్​ మెట్రో రైలు సంస్థ 20 మంది ట్రాన్స్​జెండర్లను సెక్యూరిటీ సిబ్బందిగా నియమించింది. ట్రాన్స్​జెండర్ (Transgender)​ సెక్యూరిటీ సిబ్బంది మహిళల భద్రతకు మద్దతు ఇస్తారని సంస్థ పేర్కొంది. ప్రయాణీకులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు, బ్యాగేజ్ స్కానర్‌లలో సహాయం చేస్తారని, కీలకమైన స్టేషన్లు రైళ్లలో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Metro | సమాజంలో వివక్ష గురి అవుతున్న ట్రాన్స్​జెండర్లకు ఉపాధి విషయంలో ఇటీవల ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపుతున్నాయి. వారికి ఉద్యోగాలు, వ్యాపారాల్లో అవకాశాలు కల్పిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్​ మెట్రో రైలు సంస్థ 20 మంది ట్రాన్స్​జెండర్లను సెక్యూరిటీ సిబ్బందిగా నియమించింది.

ట్రాన్స్​జెండర్ (Transgender)​ సెక్యూరిటీ సిబ్బంది మహిళల భద్రతకు మద్దతు ఇస్తారని సంస్థ పేర్కొంది. ప్రయాణీకులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు, బ్యాగేజ్ స్కానర్‌లలో సహాయం చేస్తారని, కీలకమైన స్టేషన్లు రైళ్లలో భద్రతను బలోపేతం చేస్తారని వెల్లడించింది. తమను విధుల్లోకి తీసుకోవడంపై ట్రాన్స్​జెండర్లు హర్షం వ్యక్తం చేశారు.

Hyderabad Metro | ప్రభుత్వ ఉద్యోగాలు సైతం..

దేశంలో గతంలో ట్రాన్స్​జెండర్లు ఉద్యోగాలు చేసే వారు కాదు. చాలా మంది చదువుకు దూరమై.. యాచిస్తూ జీవనం సాగించేవారు. అయితే ఇటీవల ప్రభుత్వాలు, ఎన్జీవో (NGO)ల సాయంతో ట్రాన్స్​జెండర్లు సైతం చదువుకొని కొలువులు సాధిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా చేరుతున్నారు. ట్రాఫిక్​ పోలీసులుగా విధులు నిర్వహిస్తున్నారు.

Hyderabad Metro | వేధింపులు ఆగుతాయా..

రాష్ట్రంలో చాలా మంది ట్రాన్స్​జెండర్లు యాచిస్తూ జీవనం సాగిస్తారు. ఎక్కువగా రైళ్లలో అడుక్కుంటారు. అయితే వీరు ప్రజలను వేధిస్తారనే విమర్శలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే నానా హంగామా చేస్తారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, షాప్​ ఓపినింగ్​ సమయంలో హిజ్రాలు వచ్చి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్​ చేస్తారు. ఇవ్వకపోతే రచ్చ రచ్చ చేస్తారు. ఇటీవల హైదరాబాద్​లో గృహ ప్రవేశానికి రూ.50 వేలు డిమాండ్​ చేశారు. సదరు ఇంటి యజమాని ఇవ్వకపోవడంతో అతడిపై దాడి చేశారు. ఇలా చాలా సందర్భాల్లో ట్రాన్స్​జెండర్లు ప్రజలు ఇచ్చింది తీసుకోకుండా.. వేధింపులకు పాల్పడుతున్నారు. అయితే ప్రభుత్వాలు, వివిధ సంస్థలు వారికి శిక్షణ ఇచ్చి, కొలువులు ఇస్తుండటంతో వారి వేధింపులు ఆగుతాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...