Inspector Transfers | పలువురు ఇన్​స్పెక్టర్ల బదిలీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inspector Transfers | సైబరాబాద్​ కమిషనరేట్​ (Cyberabad Commissionerate) పరిధిలో పలువురు ఇన్​స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాశ్​ మహంతి (CP Avinash Mahanty) ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 9 మందికి స్థాన చలనం కలిగించారు. Inspector Transfers | తొమ్మిది మంది బదిలీ శంషాబాద్​ ఎయిర్​పోర్టు ఠాణా ఎస్​హెచ్​వోగా పని చేస్తున్న కె.బాలరాజును గచ్చిబౌలికి పీఎస్​కు బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న మహ్మద్​ హబిబుల్లాఖాన్​ను వీఆర్​కు అటాచ్​ చేశారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inspector Transfers | సైబరాబాద్​ కమిషనరేట్​ (Cyberabad Commissionerate) పరిధిలో పలువురు ఇన్​స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాశ్​ మహంతి (CP Avinash Mahanty) ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 9 మందికి స్థాన చలనం కలిగించారు.

Inspector Transfers | తొమ్మిది మంది బదిలీ

శంషాబాద్​ ఎయిర్​పోర్టు ఠాణా ఎస్​హెచ్​వోగా పని చేస్తున్న కె.బాలరాజును గచ్చిబౌలికి పీఎస్​కు బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న మహ్మద్​ హబిబుల్లాఖాన్​ను వీఆర్​కు అటాచ్​ చేశారు. మాదాపూర్​ సీసీఎస్​లో (Madhapur CCS)​ పని చేస్తున్న బి.సంజీవులును శంషాబాద్ ఎయిర్​పోర్టు స్టేషన్​ ఎస్​హెచ్​వోగా ట్రాన్స్​ఫర్ చేశారు. మాదాపూర్​ ట్రాఫిక్​ పీఎస్​లో (Madhapur Traffic PS) పని చేస్తున్న బి.సత్యనారాయణ మారేడ్​పల్లికి బదిలీ అయ్యారు. అక్కడ ఉన్న పి.నరేందర్​ సైబరాబాద్​ ఎకానమిక్​ అఫెన్స్​ వింగ్​కు వెళ్లారు.

కూకట్​పల్లి ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​లో (Traffic Police Station) పని చేస్తున్న ముత్తు యాదవ్​ రాజేంద్రనగర్​కు, అల్వాల్​ పీఎస్​లో విధులు నిర్వర్తిస్తున్న తిమ్మప్ప కూకట్​పల్లి ట్రాఫిక్​ పీఎస్​కు బదిలీ అయ్యారు. మాదాపూర్​ డీసీపీ కార్యాలయంలో (Madhapur DCP Office) పని చేస్తున్న వీరబాబు అల్వాల్​కు, శంషాబాద్ జోన్​ స్పెషల్ బ్రాంచ్​లో ఉన్న నాగేంద్రబాబు మాదాపూర్​ ట్రాఫిక్​ పీఎస్​కు ట్రాన్స్​ఫర్​ అయ్యారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...