Training to Sarpanches | నూతన సర్పంచులకు శిక్షణ తరగతులు: జిల్లా పంచాయతీ అధికారి మురళి

అక్షరటుడే, కామారెడ్డి: Training to Sarpanches | ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు (Gram Panchayat elections) ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. జిల్లాలోని 532 గ్రామ పంచాయతీలలో పాలకవర్గాలు కూడా కొలువయ్యాయి. దాంతో ప్రభుత్వం మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు (Sarpanches) శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. కొత్త సర్పంచులకు బాధ్యతలు, వారి విధి విధానాలు, ఇతర అంశాలను శిక్షణ కార్యక్రమాల్లో అధికారులు వివరించనున్నారు. Training to Sarpanches | 532 సర్పంచ్​లకు.. […]

అక్షరటుడే, కామారెడ్డి: Training to Sarpanches | ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు (Gram Panchayat elections) ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. జిల్లాలోని 532 గ్రామ పంచాయతీలలో పాలకవర్గాలు కూడా కొలువయ్యాయి. దాంతో ప్రభుత్వం మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు (Sarpanches) శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. కొత్త సర్పంచులకు బాధ్యతలు, వారి విధి విధానాలు, ఇతర అంశాలను శిక్షణ కార్యక్రమాల్లో అధికారులు వివరించనున్నారు.

Training to Sarpanches | 532 సర్పంచ్​లకు..

జిల్లాలోని 532 మంది సర్పంచులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 28 వరకు విడతల వారీగా 5 రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు శిక్షణ నిర్వహించబోయే తేదీలు జిల్లా పంచాయతీ అధికారి మురళి (District Panchayat Officer Murali) ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని (Government Degree College) రూసా భవనంలోని రెండు హాళ్లలో ఈ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈనెల 19 నుంచి 23 వరకు మొదటి హాల్​లో లింగంపేట మండలంలోని 41 మంది సర్పంచులు, దోమకొండ మండలంలోని 9 మంది, రెండవ హాలులో బాన్సువాడ మండలంలోని 25 మంది, మహమ్మద్ నగర్ మండలంలోని 13 మంది, భిక్కనూరు మండలంలోని 18 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు.

Training to Sarpanches | ఫిబ్రవరి 3 నుంచి 7 వ తేదీ వరకు..

ఫిబ్రవరి 3 నుంచి 7 వ తేదీ వరకు మొదటి హాల్​లో సదాశివనగర్ మండలంలోని 45 మంది, బీర్కూర్ మండలంలోని 13 మంది, కామారెడ్డి మండలంలోని 14 మంది, రెండవ హాలులో రామారెడ్డి మండలంలోని 18 మంది, రాజంపేట మండలంలోని 18 మంది, తాడ్వాయి మండలంలోని 18 మంది సర్పంచులకు శిక్షణ ఏర్పాటు చేశారు.

Training to Sarpanches | ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు..

ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు మొదటి హాల్​లో గాంధారి మండలంలోని 45 మంది బీబీపేట మండలంలోని 11 మంది, నాగిరెడ్డిపేట మండలంలోని 27 మంది, పాల్వంచ మండలంలోని 12 మంది, నిజాంసాగర్ మండలంలోని 14 మంది సర్పంచులకు శిక్షణ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు మొదటి హాలులో ఎల్లారెడ్డి మండలంలోని 31 మంది, మాచారెడ్డి మండలంలోని 25 మంది, రెండవ హాల్​లో బిచ్కుంద మండలంలోని 23 మంది, జుక్కల్ మండలంలోని 30 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు.

Training to Sarpanches | ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు..

ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు మొదటి హాల్​లో మద్నూర్ మండలంలోని 21మంది, డోంగ్లీ మండలంలోని 13 మంది, నస్రుల్లాబాద్​ మండలంలోని 19 మంది, పిట్లం మండలంలోని 26 మంది, పెద్ద కొడప్​గల్ మండలంలోని 24 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొదటి బ్యాచ్​లో 106 మంది, రెండో బ్యాచ్​లో 105 మంది, మూడో బ్యాచ్​లో 109 మంది, నాలుగో బ్యాచ్​లో 109 మంది, ఐదో బ్యాచ్​లో 103 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ సమయంలో సర్పంచులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...