Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Railway Police | రైళ్లలో చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్​

Nizamabad Railway Police | రైళ్లలో చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్​

తరచుగా రైళ్లలో చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు రైల్వే ఎస్సై సాయిరెడ్డి వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad Railway Police | రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి (Railway Sub-Inspector Sai Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. పక్కా సమాచారం మేరకు.. శనివారం తనతో పాటు ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్​, ఐడీ పార్టీ పోలీసులు హనుమాన్​ గౌడ్​, సురేందర్​, గురుదాస్​ కలిసి మేడ్చల్​ రైల్వేస్టేషన్​కు (Medchal railway station) వెళ్లి పాత నేరస్థుడిపై నిఘా వేశామన్నారు.

అక్కడికి వచ్చిన పాత నేరస్థుడు మంచిర్యాల్​కు చెందిన షేక్​ యూనుస్​ను అదుపులోకి తీసుకుని నిజామాబాద్​ రైల్వే పోలీస్​స్టేషన్​కు (Railway Police Station) తరలించామన్నారు. అతడి నుంచి రెండు సెల్​ఫోన్లు, రూ.20వేల నగదు స్వాధీనం చేసుకుని అతడిని కోర్టుకు అప్పజెప్పినట్లు పేర్కొన్నారు.