Yellareddy | పొలం చదును చేస్తుండగా ట్రాక్టర్ ​పైనుంచి పడి రైతు దుర్మరణం

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | పొలం నాట్లు వేసేందుకు ట్రాక్టర్ కేజ్​వీల్​తో చదును చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్​పై నుంచి పడి ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఎల్లారెడ్డి మండలం మిషన్ పల్లి గ్రామంలో (Mission Palli Village) శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మిషన్ పల్లి గ్రామానికి చెందిన బోండ్ల శ్రీను అనే రైతు (Farmers) తన పొలంలో సొంత ట్రాక్టర్​తో దున్నుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్​తో దున్నుతున్న సమయంలో […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | పొలం నాట్లు వేసేందుకు ట్రాక్టర్ కేజ్​వీల్​తో చదును చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్​పై నుంచి పడి ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఎల్లారెడ్డి మండలం మిషన్ పల్లి గ్రామంలో (Mission Palli Village) శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.

మిషన్ పల్లి గ్రామానికి చెందిన బోండ్ల శ్రీను అనే రైతు (Farmers) తన పొలంలో సొంత ట్రాక్టర్​తో దున్నుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్​తో దున్నుతున్న సమయంలో ట్రాక్టర్​పై నుంచి పడి మట్టిలో కూరుకుపోయి ఊపిరి ఆడక మృతి చెందాడు. డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ పొలంలో తిరుగుతుందని రహదారి వెంట వెళ్లే స్థానికులు చూసి పరిశీలించగా.. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ విషయమై కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. ఈ ప్రమాదం ఎలా సంభవించిందనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...