TPCC Chief Mahesh Kumar | బీసీలు ఐక్యం కావాలి.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

అక్షరటుడే, ఇందూరు: TPCC Chief Mahesh Kumar | ధర్మపురి శ్రీనివాస్​ తనకు రాజకీయ గురువు అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్​ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఆదివారం నగరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డీఎస్​ గురించి మాట్లాడారు. డీ శ్రీనివాస్ ఆశయాలకు అనుగుణంగా బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికలో బీసీలకు […]

అక్షరటుడే, ఇందూరు: TPCC Chief Mahesh Kumar | ధర్మపురి శ్రీనివాస్​ తనకు రాజకీయ గురువు అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్​ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఆదివారం నగరంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డీఎస్​ గురించి మాట్లాడారు. డీ శ్రీనివాస్ ఆశయాలకు అనుగుణంగా బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు.

TPCC Chief Mahesh Kumar |

రాష్ట్రంలో 17 డీసీసీ పదవులను బీసీలకు ఇచ్చినట్లు గుర్తుచేశారు. 75 శాతం బీసీ, ఎస్టీ, ఎస్టీలకే కేటాయించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ చేపట్టిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

బీసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ కులాలన్నీ ఏకతాటిపైకి రావాలని మహేష్​ కుమార్​ గౌడ్​ పిలుపునిచ్చారు. మున్నూరు కాపు సామాజికవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నట్లు చెప్పారు.

కార్యక్రమంలో ధర్మపురి సంజయ్​ నిజామాబాద్​ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఆయనతోపాటు కార్యవర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసింది.

Related articles

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.

Kharge Jaggareddy Meeting | ఖర్గేను కలిసిన జగ్గారెడ్డి.. రాజ్యసభ సభ్యులపై వినతి

కాంగ్రెస్​ జాతీయ​ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గేను జగ్గారెడ్డి కలిశారు. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో వి హనుమంత్​రావు, జెట్టి కుసుమకుమర్​కు అవకాశం ఇవ్వాలని కోరారు.

BC Reservations Congress | కాంగ్రెస్​ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యత..:​ ఈరవత్రి అనిల్​

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ ఈరవత్రి అనిల్​ అన్నారు.

Exam Center Security | పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

ఇంటర్​ పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. బోధన్​ పట్టణంలోని జూనియర్​ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు.