Fake Toothpaste | టూత్​ పేస్ట్​ను వదలడం లేదు.. నకిలీ కోల్గేట్​ పేస్ట్​ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Toothpaste | దేశంలో ప్రతి వస్తువును కల్తీ చేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్​ నుంచి మొదలు పెడితే మద్యం వరకు ప్రతి దానిని కల్తీ చేసి విక్రయిస్తున్నారు. తమ లాభాల కోసం కొందరు కల్తీ వస్తువులు తయారు చేసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు టూత్​ పేస్ట్ ను కూడా కేటుగాళ్లు కల్తీ చేశారు. ఇప్పటికే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​, నూనెలతో ప్రజలు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Toothpaste | దేశంలో ప్రతి వస్తువును కల్తీ చేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్​ నుంచి మొదలు పెడితే మద్యం వరకు ప్రతి దానిని కల్తీ చేసి విక్రయిస్తున్నారు.

తమ లాభాల కోసం కొందరు కల్తీ వస్తువులు తయారు చేసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు టూత్​ పేస్ట్ ను కూడా కేటుగాళ్లు కల్తీ చేశారు. ఇప్పటికే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​, నూనెలతో ప్రజలు అనారోగ్యం భారీన పడుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కల్తీ మద్యం వెలుగులోకి రావడంతో మందుబాబులు ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా కోల్గేట్​ టూత్​పేస్ట్ను సైతం కల్తీ చేశారు. నకిలీ పేస్ట్​ తయారు చేసి కోల్గేట్​ బ్రాండ్ పేరిట విక్రయిస్తున్నారు.

Fake Toothpaste | గుజరాత్​లో..

గుజరాత్​(Gujrath)లోని కచ్​లో పోలీసులు వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు కలిగించే భారీ రాకెట్​ను ఛేదించారు. రాపర్ తాలూకాలోని చిత్రోడ్ ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీపై గడోదర్ పోలీసులు(Gadodar Police) దాడి శుక్రవారం దాడి చేశారు. ఈ కంపెనీలో నకిలీ కోల్గేట్​(Fake Colgate Toothpaste)​ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం కంపెనీ ప్రతినిధులను సంప్రదించి అవి అసలు ఉత్పత్తులు కాదని నిర్ధారించారు. నాణ్యత లేని, తక్కువ ధరకు దొరికే వస్తువులతో నిందితులు టూత్​పేస్ట్​ తయారు చేస్తున్నారు. అంతేగాకుండా వాటిని నిజమైన కోల్‌గేట్ ఉత్పత్తులుగా మార్కెట్‌లో విక్రయించారని పోలీసులు తెలిపారు. నకిలీ టూత్‌పేస్ట్ బ్యాచ్‌లు, ప్యాకింగ్ మెటీరియల్స్, ఉత్పత్తి పరికరాలు సహా సుమారు రూ.9.43 లక్షల విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Fake Toothpaste | నలుగురిపై కేసు

నకిలీ టూత్​పేస్ట్​ తయారు చేస్తున్న ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాపర్ తాలుకాలోని నలియాటింబా ప్రాంతానికి చెందిన రాజేష్ దియాభాయ్ మక్వానా, సురేష్ మహేష్‌భాయ్ ఉమత్, నట్వర్ అజాభాయ్ గోహిల్, నర్పత్ అలియాస్ నారు దియాభాయ్ మక్వానా అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మోసం, కాపీరైట్ ఉల్లంఘన, వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించే పదర్థాలు తయారు చేసినట్లు వారిపై కేసులు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నకిలీ టూత్‌పేస్ట్ బ్యాచ్‌లు ఎక్కడ పంపిణీ చేయబడ్డాయో తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...