Toll plaza staff attack | న్యాయవాదిపై టోల్​ ప్లాజా సిబ్బంది.. న్యాయవాదుల సమష్టి పోరాటం.. నెట్టింట వైరల్​!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Toll plaza staff attack | టోల్​ రుసుం చెల్లింపు విషయంలో ఓ న్యాయవాదికి టోల్​ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సదరు న్యాయవాదిపై టోల్​ ప్లాజా సిబ్బంది దాడి చేసి, విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ Uttar Pradesh లోని బరాబంకి జిల్లా Barabanki district , హైదర్‌గఢ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. Toll plaza staff attack | ట్రాఫిక్​ జామ్​.. టోల్​ ఫ్రీ.. విషయం తెలుసుకున్న […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Toll plaza staff attack | టోల్​ రుసుం చెల్లింపు విషయంలో ఓ న్యాయవాదికి టోల్​ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సదరు న్యాయవాదిపై టోల్​ ప్లాజా సిబ్బంది దాడి చేసి, విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ Uttar Pradesh లోని బరాబంకి జిల్లా Barabanki district , హైదర్‌గఢ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Toll plaza staff attack | ట్రాఫిక్​ జామ్​.. టోల్​ ఫ్రీ..

విషయం తెలుసుకున్న తోటి న్యాయవాదులు వందల సంఖ్యలో సదరు టోల్​ ప్లాజా వద్దకు చేరుకున్నారు. లక్నో-సుల్తాన్పూర్ నేషనల్ హైవే (NH-731) పై ఉన్న గోతౌనా బారా Gothana Bara  టోల్ ప్లాజా Toll plaza వద్దకు భారీ న్యాయవాదులు తమ వాహనాలతో చేరుకుని ఆందోళనకు దిగారు.

పెద్ద ఎత్తున వాహనాల్లో న్యాయవాదులు అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతం పూర్తిగా ట్రాఫిక్​తో స్తంభించిపోయింది. దీంతో టోల్​ మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కొన్ని గంటలపాటు టోల్​ ఫ్రీగా ఆ రహదారి కొనసాగింది. తోటి న్యాయవాది కోసం మిగతా న్యాయవాదులు సమష్టిగా పోరాడి విజయం సాధించిన తీరు ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ ఆదరణ పొందుతోంది.

కాగా, న్యాయవాదిపై దాడి ఘటన విషయంలో ముగ్గురు టోల్​ ప్లాజా సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, సదరు సిబ్బందికి శిక్ష పడే వరకు ఊరుకునేది లేదని న్యాయవాదులు పేర్కొన్నారు. అంతేకాకుండా వారి తరఫున ఏ న్యాయవాది కూడా వాదించ వద్దని తీర్మానించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...