Homeతాజావార్తలుToday Gold Prices | బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. తెలుగు రాష్ట్రాల‌లో ఎలా...

Today Gold Prices | బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. తెలుగు రాష్ట్రాల‌లో ఎలా ఉన్నాయంటే..!

Today Gold Prices | ప్రస్తుతం గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా బంగారం–వెండి ధరలు రోజువారీగా మారుతున్నాయి. అమెరికా ఆర్థిక డేటా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకోబోయే నిర్ణయాలు, భౌగోళిక ఉద్రిక్తతలు తదితర అంశాలు ధరలను ప్రభావితం చేస్తున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో Silver Prices మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా నిరంతరంగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు, డిసెంబర్ 3న స్వల్పంగా తగ్గాయి. నిన్నటి ధరతో పోల్చితే నేడు తులానికి రూ.10 మేర తగ్గుదల నమోదైంది.

ఇదే విధంగా వెండి ధర కూడా కిలోకు రూ.100 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలహీనత, గ్లోబల్ ఆర్థిక మార్పులు, బాండ్ల యీల్డ్స్‌లో ఊగిసలాట వంటి అంశాల కారణంగా భారత మార్కెట్లో కూడా ధరలు ప్రభావితమవుతున్నాయి.

ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశవ్యాప్తంగా సగటు రూ.1,29,860 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,040గా ఉంది.

Today Gold Prices | స్వ‌ల్ప త‌గ్గుద‌ల‌..

ఉత్సవ కాలం ముగిసిన తర్వాత డిమాండ్ కాస్త తగ్గిన నేపథ్యంలో ధరలు కొంతమేర సద్దుమణిగినట్లు భావిస్తున్నారు. ఆభరణాల కొనుగోళ్ల కంటే పెట్టుబడి దారుల డిమాండ్‌ ఆధారంగానే ఇప్పుడు మార్కెట్ కదులుతోంది. దేశంలోని ముఖ్య పట్టణాల్లో నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలో Delhi 24 క్యారెట్లు – రూ.1,28,620, 22 క్యారెట్లు – రూ.1,17,910 కాగా, ముంబైలో 24 క్యారెట్లు – రూ.1,29,860, 22 క్యారెట్లు – రూ.1,19,040గా ట్రేడ్ అయింది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్లు – రూ.1,29,860 ట్రేడ్ కాగా, 22 క్యారెట్లు – రూ.1,19,040గా న‌మోదు అయింది. ఇక విజయవాడలో 24 క్యారెట్లు – రూ.1,29,860గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్లు – రూ.1,19,040గా న‌మోదైంది.

ఇక చెన్నైలో Chennai 24 క్యారెట్లు – రూ.1,31,340గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్లు – రూ.1,20,390గా న‌మోదైంది. ఇక బెంగ‌ళూరులో 24 క్యారెట్లు – రూ.1,29,860గా న‌మోదు కాగా, 22 క్యారెట్లు – రూ.1,19,040గా ఉంది.

చెన్నైలో ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగా ఉండటం అక్కడి స్థానిక డిమాండ్, రవాణా ఖర్చులు వంటి అంశాల ప్రభావంగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

బంగారంతో పాటు వెండి ధరల్లో కూడా ఈ రోజు స్వల్ప తగ్గుదల నమోదైంది. దేశవ్యాప్తంగా కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి

హైదరాబాద్ – రూ.1,95,900, చెన్నై – రూ.1,95,900, బెంగళూరు – రూ.1,95,900, ముంబై – రూ.1,87,900, ఢిల్లీ – రూ.1,87,900, విజయవాడ – రూ.1,95,900, విశాఖపట్నం – రూ.1,95,900. ముంబై, ఢిల్లీలో వెండి ధరలు ఇతర నగరాలతో పోలిస్తే తక్కువగా ఉండటం అక్కడి బల్క్‌ ట్రేడింగ్‌ మరియు దిగుమతి మార్గాల సౌలభ్యం కారణంగా జరుగుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.

Must Read
Related News