Today Gold Prices | ప‌సిడి ప్రియుల‌కి స్వ‌ల్ప ఊర‌ట‌.. బంగారం ధ‌ర‌ ఎంత తగ్గిందంటే..!

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం ధర లక్షన్నర వైపు దూసుకెళ్తూ, రూ. లక్షా 30 వేల మార్క్‌ చేరువలో ఉంది. నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు Silver Prices క్ర‌మంగా పెరుగుతూ సాధారణ ప్రజలకు అందనంత దూరంగా వెళ్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో బంగారం […]

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం ధర లక్షన్నర వైపు దూసుకెళ్తూ, రూ. లక్షా 30 వేల మార్క్‌ చేరువలో ఉంది. నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు Silver Prices క్ర‌మంగా పెరుగుతూ సాధారణ ప్రజలకు అందనంత దూరంగా వెళ్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో బంగారం పెట్టుబడిదారులకు ఆకర్షణీయ ఆస్తిగా మారింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో తులం బంగారం ధర లక్షన్నర వైపు దూసుకెళ్తోంది.

తులం ధర ఇప్పుడు రూ. లక్షా 30 వేలకు చేరువలో ఉండగా, రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అయితే గురువారంతో పోలిస్తే శుక్రవారం Friday పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది.

తాజాగా అక్టోబర్ 17న దేశీయంగా బంగారం ధర రూ.20 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,430గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.20 తగ్గి రూ.1,18,640కు చేరింది.

Today Gold Prices | కాస్త ఉప‌శ‌మ‌నం..

వెండి ధరలు కూడా భారీ స్థాయిలో కొనసాగుతూనే ఉన్నాయి. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1,88,900గా ఉంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కేరళ వంటి నగరాల్లో వెండి ధర రూ.2,05,900గా ఉంది.

దీంతో వెండి కూడా తగ్గేదేలే అనిపించేలా రూ.2 లక్షల మార్కును దాటి రికార్డు సృష్టించింది. రాబోయే రోజుల్లో వెండి ధరలు కూడా మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెద్దగా తేడా లేకుండా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,29,580గా ఉండగా, చెన్నైలో రూ.1,29,830కు చేరింది.

హైదరాబాద్, ముంబయి Mumbai, విజయవాడ, బెంగళూరు Bangalore నగరాల్లో 24 క్యారెట్ల (24 carat gold) 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,430గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం (22 carat gold) ధర రూ.1,18,640గా ఉంది.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో రాజకీయ, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు భవిష్యత్తులో మరింత పెరుగుతాయని అంచనా.

ఇప్పటికే ఔన్సు బంగారం ధర 4 వేల డాలర్ల మార్కును దాటగా, దేశీయంగా రూ.1.30 లక్షల స్థాయిని అధిగమించింది. ఈ ధోరణి కొనసాగితే 2028 చివరి నాటికి లేదా 2029 ఆరంభంలో ఔన్సు బంగారం ధర 10 వేల డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆ సమయానికి భారత్‌లో బంగారం ధర రూ.3 లక్షల మార్క్‌ను దాటవచ్చని అంచనా వేస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...