Homeజిల్లాలునిజామాబాద్​TNGOs Nizamabad | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్​ కృషి

TNGOs Nizamabad | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్​ కృషి

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్​ కృషి చేస్తుందని టీఎన్జీవోస్​ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​ కుమార్ పేర్కొన్నారు. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో శుక్రవారం వ్యవసాయశాఖలో ఉద్యోగులకు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: TNGOs Nizamabad | ఉద్యోగుల సమస్యల (employee issues) పరిష్కారానికి టీఎన్జీవోస్​ కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​ కుమార్ అన్నారు. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో శుక్రవారం వ్యవసాయశాఖలో ఉద్యోగులకు సభ్యత్వ నమోదు కార్యక్రమం (membership registration program) నిర్వహించారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన వ్యవసాయ శాఖ ఉద్యోగి ఫణి కళ్యాణ్​ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.

అనంతరం ఉద్యోగులకు ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్​ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ 2025‌‌–26కు గాను ఉద్యోగులకు సభ్యత్వాలను అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఫోరం జిల్లా అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, టీఎన్జీవోస్​ జిల్లా కార్యవర్గ సభ్యులు విజయలక్ష్మి, సునీల్ టీఎన్జీవోస్​ ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, వ్యవసాయ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News