అక్షరటుడే, ఆర్మూర్ : TNGOS Armoor | ఉద్యోగుల ఉన్నతే టీఎన్జీవోస్ లక్ష్యమని జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్కుమార్ పేర్కొన్నారు. టీఎన్జీవోస్ ఆర్మూర్ (TNGOS Armoor) యూనిట్ అధ్యక్షుడు కె.శశికాంత్ రెడ్డి, యూనిట్ కార్యదర్శి విశాల్ అధ్యక్షతన గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాశెట్టి సుమన్ కుమార్, నేతికుంట శేఖర్ హాజరై సభ్యత్వాన్ని (TNGOs Membership) ఉద్యోగులకు అందజేశారు. ఈ సందర్భంగా సుమన్కుమార్ మాట్లాడుతూ.. టీఎన్జీవో సంఘం ప్రాముఖ్యతను సవివరంగా తెలియజేసి.. ప్రతి ప్రాథమిక సభ్యుడు సన్మానం కోసం కాకుండా సమస్యల అర్జీలతో టీఎన్జీవోస్ కార్యాలయానికి (TNGOs Office) రావాలని తెలియజేశారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేని రానున్నారని తెలిపారు. అన్ని శాఖల ఉద్యోగులు, టీఎన్జీవోస్ నాయకులు (TNGOs Leaders) మెగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు అతీక్ అహ్మద్, సంయుక్త కార్యదర్శి విశాల్ రెడ్డి, వెల్ఫేర్ శాఖ జిల్లా అధ్యక్షుడు సురేష్, ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
ఎస్సారెస్పీ, భీమ్గల్ యూనిట్లలో..
అక్షరటుడే, మెండోరా: టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఎస్సారెస్పీ, భీమ్గల్ టీఎన్జీవోస్ యూనిట్లలో గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి నేతికుంట శేఖర్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.

