Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | ముగ్గురు మహిళలకు జైలుశిక్ష.. ఎందుకో తెలుసా?

Nizamabad | ముగ్గురు మహిళలకు జైలుశిక్ష.. ఎందుకో తెలుసా?

నిజామాబాద్​ నగరంలో ముగ్గురు మహిళలు అసభ్యంగా ప్రవర్తించారు. వారికి సెకండ్​ క్లాస్​ మేజిస్ట్రేట్​ జైలు శిక్ష విధించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nizamabad | ముగ్గురు మహిళలకు జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్​ స్పెషల్ కోర్టు (Nizamabad Special Court) సెకండ్ క్లాస్ జడ్జి తీర్పు చెప్పారు. బస్టాండ్​, రైల్వే స్టేషన్​ (railway station) ప్రాంతంలో వీరు అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు అరెస్ట్​ చేసి కోర్టులో హాజరు పరిచారు.

నగరంలోని బస్టాండ్​, రైల్వే స్టేషన్​ ప్రాంతంలో బుధవారం రాత్రి ముగ్గురు మహిళలు అసభ్యంగా ప్రవర్తించారు. తమ శరీరం చూపిస్తూ పురుషులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. పబ్లిక్​లో న్యూసెన్స్​ చేస్తున్న వారిని వన్​ టౌన్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. గురువారం ఉదయం కోర్టులో హాజరు పర్చగా.. ముగ్గురికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు ఎస్​హెచ్​వో రఘుపతి (SHO Raghupathi) తెలిపారు. ఎవరైనా న్యూసెన్స్ చేస్తూ శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.