Peddakodapgal | కాంగ్రెస్​ పార్టీ నుంచి ముగ్గురి సస్పెన్షన్​​.. ఎందుకో తెలుసా..!

అక్షరటుడే, పెద్దకొడప్​గల్: Peddakodapgal | స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్​ పార్టీలో (Congress party) కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ నుంచి ముగ్గురిని సస్పెండ్​ చేస్తున్నట్లు కాంగ్రెస్ పెద్దకొడప్​గల్​​ మండల అధ్యక్షుడు మహేందర్​ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల (local body elections) నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్​ నాయకులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామన్నారు. ఈ […]

అక్షరటుడే, పెద్దకొడప్​గల్: Peddakodapgal | స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్​ పార్టీలో (Congress party) కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ నుంచి ముగ్గురిని సస్పెండ్​ చేస్తున్నట్లు కాంగ్రెస్ పెద్దకొడప్​గల్​​ మండల అధ్యక్షుడు మహేందర్​ రెడ్డి పేర్కొన్నారు.

మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల (local body elections) నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్​ నాయకులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామన్నారు. ఈ మేరకు మాజీ సర్పంచ్ నాగిరెడ్డి, బస్వరాజ్ దేశాయ్, అంజనీ నాందేవ్ పటేల్​ను సస్పెండ్​ చేస్తున్నట్లుగా ప్రకటించారు.

జుక్కల్ శాసనసభ్యుడు తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmi Kanta Rao) ఆదేశాల మేరకు పార్టీ నుంచి వారిని తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం కల్పించడం జరగుతుందన్నారు. కానీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు మోహన్, అక్కల్ సాయిరెడ్డి, మానిక్ రెడ్డి, సంజీవ్, పందిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...