Homeతాజావార్తలుHyderabad | ఒకే రోజు ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య

Hyderabad | ఒకే రోజు ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య

హైదరాబాద్​ నగరంలో ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు ఇంటర్​ విద్యార్థులు, ఒక ఇంజినీరింగ్​ స్టూడెంట్​ బలవన్మరణానికి పాల్పడ్డారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు ఇంటర్​ విద్యార్థులు, ఒక ఇంజినీరింగ్​ స్టూడెంట్​ బలవన్మరణానికి పాల్పడ్డారు.

నగరంలోని బాచుపల్లి శ్రీ చైతన్య జూనియర్​ కాలేజీ (Sri Chaitanya Junior College)లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా (Mahabubnagar District) మక్తల్‌కు చెందిన వర్షిత ఇంటర్​ ఫస్టియర్​ చదువుతోంది. ఆమె హాస్టల్​ గదిలో చున్నితో ఉరి వేసుకుంది. గమనించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు.

Hyderabad | నిజాంపేటలో..

నిజాంపేట ప్రగతి జూనియర్​ కాలేజీ (Pragathi Junior College)లో సెకండియర్​ చదువుతున్న మంజూనాథ్​ (18) ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని సమాచారం. అమ్మాయి తల్లి, మరో మహిళ ఇంటికి వచ్చి మంజూనాథ్​కు వార్నింగ్​ ఇవ్వడంతో బలవన్మరణానికి పాల్పడ్డట్లు తెలిసింది. మరోవైపు ఉస్మానియ యూనివర్సిటీ (Osmania University)లో ఇంజినీరింగ్​ విద్యార్థి తనువు చాలించాడు. విజ్ఞాన్‌ అనే యువకుడు ఆక్సిజన్‌ పార్క్‌లో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. హుజురాబాద్​కు చెందిన విజ్ఞాన్​ మైనింగ్‌ ఇంజినీరింగ్​ సెకండియర్​ చదువుతున్నాడు.

Must Read
Related News