Hyderabad | ఒకే రోజు ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు ఇంటర్​ విద్యార్థులు, ఒక ఇంజినీరింగ్​ స్టూడెంట్​ బలవన్మరణానికి పాల్పడ్డారు. నగరంలోని బాచుపల్లి శ్రీ చైతన్య జూనియర్​ కాలేజీ (Sri Chaitanya Junior College)లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా (Mahabubnagar District) మక్తల్‌కు చెందిన వర్షిత ఇంటర్​ ఫస్టియర్​ చదువుతోంది. ఆమె హాస్టల్​ గదిలో చున్నితో ఉరి వేసుకుంది. గమనించిన హాస్టల్ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు ఇంటర్​ విద్యార్థులు, ఒక ఇంజినీరింగ్​ స్టూడెంట్​ బలవన్మరణానికి పాల్పడ్డారు.

నగరంలోని బాచుపల్లి శ్రీ చైతన్య జూనియర్​ కాలేజీ (Sri Chaitanya Junior College)లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా (Mahabubnagar District) మక్తల్‌కు చెందిన వర్షిత ఇంటర్​ ఫస్టియర్​ చదువుతోంది. ఆమె హాస్టల్​ గదిలో చున్నితో ఉరి వేసుకుంది. గమనించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు.

Hyderabad | నిజాంపేటలో..

నిజాంపేట ప్రగతి జూనియర్​ కాలేజీ (Pragathi Junior College)లో సెకండియర్​ చదువుతున్న మంజూనాథ్​ (18) ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని సమాచారం. అమ్మాయి తల్లి, మరో మహిళ ఇంటికి వచ్చి మంజూనాథ్​కు వార్నింగ్​ ఇవ్వడంతో బలవన్మరణానికి పాల్పడ్డట్లు తెలిసింది. మరోవైపు ఉస్మానియ యూనివర్సిటీ (Osmania University)లో ఇంజినీరింగ్​ విద్యార్థి తనువు చాలించాడు. విజ్ఞాన్‌ అనే యువకుడు ఆక్సిజన్‌ పార్క్‌లో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. హుజురాబాద్​కు చెందిన విజ్ఞాన్​ మైనింగ్‌ ఇంజినీరింగ్​ సెకండియర్​ చదువుతున్నాడు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...