Police Suspended | ముగ్గురు పోలీసుల సస్పెన్షన్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: Police Suspended | ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District)లో ముగ్గురు పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. సీఐ, ఎస్సైతో పాటు హెడ్ కానిస్టేబుల్​ను సస్పెండ్​ చేస్తూ ఎస్పీ సతీశ్​కుమార్​ ఆదేశాలు జారీ చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలోని తనకల్లు ఎస్సై గోపీ (SI Gopi), హెడ్​ కానిస్టేబుల్​ రామాంజనేయులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ చేపట్టిన ఆయన ఆరోపణలు నిజమని తేలడంతో ఇద్దరిని సస్పెండ్​ చేశారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Police Suspended | ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District)లో ముగ్గురు పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. సీఐ, ఎస్సైతో పాటు హెడ్ కానిస్టేబుల్​ను సస్పెండ్​ చేస్తూ ఎస్పీ సతీశ్​కుమార్​ ఆదేశాలు జారీ చేశారు.

శ్రీసత్యసాయి జిల్లాలోని తనకల్లు ఎస్సై గోపీ (SI Gopi), హెడ్​ కానిస్టేబుల్​ రామాంజనేయులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ చేపట్టిన ఆయన ఆరోపణలు నిజమని తేలడంతో ఇద్దరిని సస్పెండ్​ చేశారు. అలాగే అవినీతికి పాల్పడుతున్నారని పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయులు (CI Sivanjaneyulu)పై సైతం వేటు వేశారు.

Police Suspended | పోలీసుల ముందే హత్య

తనకల్లు పోలీస్​ స్టేషన్​ (Tanakallu Police Station) ఎదుట ఈ నెల 5న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈశ్వరప్ప అనే వ్యక్తిపై హరి, చెన్నప్ప దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగింది. అయితే పోలీసుల ముందే హత్య జరిగినా.. పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ చేపట్టిన ఎస్పీ ఎస్సై గోపీతో పాటు హెడ్​ కానిస్టేబుల్​ను సస్పెండ్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసుల ముందే హత్య జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...