Harish Rao | బీఆర్​ఎస్​పై ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | కాంగ్రెస్​, బీజేపీ కలిసి బీఆర్​ఎస్​పై కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. కాళేశ్వరం విషయంలో తమపై బురద చల్లడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission)​ నివేదికపై ఆయన మంగళవారం తెలంగాణ భవన్​లో (Telangana Bhavan) ప్రజెంటేషన్​ ఇచ్చారు. కాళేశ్వరం రిపోర్టు ఒకవైపు చూసి ఇచ్చినట్లు కనబడుతోందన్నారు. ఆ నివేదికలో ఉన్న ఆరోపణలు బేస్​లెస్​ అన్నారు. Harish Rao | కమీషన్లు.. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | కాంగ్రెస్​, బీజేపీ కలిసి బీఆర్​ఎస్​పై కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. కాళేశ్వరం విషయంలో తమపై బురద చల్లడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission)​ నివేదికపై ఆయన మంగళవారం తెలంగాణ భవన్​లో (Telangana Bhavan) ప్రజెంటేషన్​ ఇచ్చారు. కాళేశ్వరం రిపోర్టు ఒకవైపు చూసి ఇచ్చినట్లు కనబడుతోందన్నారు. ఆ నివేదికలో ఉన్న ఆరోపణలు బేస్​లెస్​ అన్నారు.

Harish Rao | కమీషన్లు.. కమిషన్ల పాలన

రాష్ట్రంలో కమీషన్లు.. కమిషన్ల పాలన నడుస్తోందని హరీశ్​రావు (Harish Rao) విమర్శించారు. బిల్లులు చెల్లించడానికి డబ్బులు అడుతున్నారని కాంట్రాక్టర్లు సచివాలయంలో నిరసన చేపట్టారని గుర్తు చేశారు. ఓ వైపు డబ్బులు దండుకోవడానికి కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రాజకీయ కక్ష సాధింపు కోసం కాంగ్రెస్​ ప్రభుత్వం కమిషన్లు వేస్తోందని విమర్శించారు.

Harish Rao | పోలవరం కూలితే పట్టించుకోలే..

గోదావరి నదిపై ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project)​ మూడు సార్లు కూలిపోయిందని హరీశ్​రావు అన్నారు. కానీ అక్కడకు ఎన్​డీఎస్​ఏ ఇప్పటి వరకు వెళ్లలేదన్నారు. కానీ మేడిగడ్డ బ్యారేజీ కుంగగానే ఎన్​డీఎస్​ఏ వచ్చి రిపోర్టులు ఇచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముందు మూడు సార్లు రిపోర్టులు ఇచ్చిందని చెప్పారు.

Harish Rao | స్థానిక ఎన్నికల నేపథ్యంలో..

రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో కాంగ్రెస్​ ప్రభుత్వం (Polavaram Project) రాజకీయ కుట్ర చేస్తోందని హరీశ్​రావు అన్నారు. కాళేశ్వరం కమిషన్​ నివేదిక రిపోర్టును బయట పెట్టి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. స్థానిక ఎన్నికలు ఉండడంతోనే రిపోర్టును బయట పెట్టారని ఆరోపించారు. తమకు కాళేశ్వరం కమిషన్​ నోటీసులు రాకముందే మీడియాకు లీకులు ఇచ్చారని విమర్శించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.

Harish Rao | అసెంబ్లీలో చీల్చి చెండాడుతాం

కాళేశ్వరం కమిషన్​ నివేదికపై ప్రభుత్వం 60 పేజీల రిపోర్టు బయట పెట్టిందన్నారు. అయితే అది కమిషన్​ నివేదికనా.. లేక ప్రభుత్వం ఏమైనా మార్పులు చేసిందా అని ప్రశ్నించారు. పూర్తి నివేదికను బయట పెట్టాలని డిమాండ్​ చేశారు. అసెంబ్లీలో చర్చ పెడితే ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామన్నారు. వాస్తవాలను అసెంబ్లీ వేదికగా (Assembly Stage) ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

Harish Rao | అది రాజకీయ జోక్యం కాదు

ప్రాజెక్ట్​లపై రివ్యూ చేయడం ముఖ్యమంత్రి విధి అని హరీశ్​ రావు తెలిపారు. నాటి సీఎం కేసీఆర్​ ప్రాజెక్ట్​ల నిర్మాణం వేగవంతం చేయాలని నిరంతరం పర్యవేక్షించారని చెప్పారు. కమిషన్​ దీనిని రాజకీయ జోక్యంగా పేర్కొనడం సరికాదన్నారు. అది ముఖ్యమంత్రి బాధ్యత అన్నారు. రాజకీయ దురుద్దేశంలో వేసిన కమిషన్​ నివేదికలు న్యాయస్థానం, ప్రజాక్షేత్రంలో నిలబడవన్నారు.

Harish Rao | తెలంగాణ ప్రదాయని కాళేశ్వరం

కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ వరప్రదాయని అని హరీశ్​ రావు అన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మించిన కేసీఆర్​ తెలంగాణ చరిత్రపుటల్లో, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారని పేర్కొన్నారు. కాళేశ్వరం రాష్ట్ర భవిష్యత్తుకు ఒక గుండెకాయ లాంటిదని ఆయన అభివర్ణించారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...