MP Arvind | విదేశాల్లో చిక్కుకున్న వారిని రక్షించాలి: పార్లమెంట్​లో ఎంపీ అర్వింద్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Arvind | విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారత యువతను తరలించి సైబర్​ మోసాలు (Cyber Crimes) చేయిస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ నేర గ్యాంగ్‌లకు బందీలుగా మార్చుతున్న సమస్యను లోక్​సభలో ఆయన గురువారం లేవనెత్తారు. తెలుగు రాష్ట్రాల యువతకు థాయ్‌లాండ్‌లో (Thailand) ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి, ఏజెంట్లు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పారు. అక్కడికి చేరిన వెంటనే వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని మయన్మార్‌లోని […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Arvind | విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారత యువతను తరలించి సైబర్​ మోసాలు (Cyber Crimes) చేయిస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ నేర గ్యాంగ్‌లకు బందీలుగా మార్చుతున్న సమస్యను లోక్​సభలో ఆయన గురువారం లేవనెత్తారు.

తెలుగు రాష్ట్రాల యువతకు థాయ్‌లాండ్‌లో (Thailand) ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి, ఏజెంట్లు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పారు. అక్కడికి చేరిన వెంటనే వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని మయన్మార్‌లోని మయావడ్డి వంటి తిరుగుబాటు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న సైబర్ నేర శిబిరాలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. బాధితులకు తీవ్రమైన హింస, ఆహారం ఇవ్వకపోవడం, చీకటి గదుల్లో నిర్బంధం వంటి దారుణాలు జరుగుతున్నాయని కుటుంబాలు తమకు సమాచారం అందించాయని తెలిపారు.

MP Arvind | చర్యలు తీసుకోవాలి

ఈ నేరాలకు అక్కడి అధికారులు కొందరు సహకరిస్తున్నారని ఎంపీ ఆరోపించారు. దీంతో అక్కడ చిక్కుకున్న వారిని రక్షించడం మరింత కష్టతరం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ (Nizamabad) నియోజకవర్గానికి చెందిన పలువురు యువకులు కూడా ఈ ముఠాకు బలి అయ్యి ప్రస్తుతం అక్కడే చిక్కుకుపోయి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అత్యవసరంగా పరిగణించి, చిక్కుకున్న భారతీయులను రక్షించాలని ఆయన కోరారు. వెనుకబడ్డ జిల్లాల్లో విదేశీ ఉద్యోగ మోసాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ నేరాలకు సహకరిస్తున్న భారతీయ ఏజెంట్లు, రిక్రూటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...