RO-KO | రోహిత్–కోహ్లీకి ఇదే చివ‌రి మ్యాచ్.. మళ్లీ ఎప్పుడు కనిపిస్తారంటే?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RO-KO | న్యూజిలాండ్‌తో (New Zealand) జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఇవాళతో (జనవరి 18) ముగింపు దశకు చేరుకుంది. ఈ సిరీస్‌లో భారత సీనియర్ స్టార్‌లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ మరోసారి తమ క్లాస్‌ను నిరూపించారు. అనుభవంతో కూడిన బ్యాటింగ్, కీలక సమయంలో పరుగులు సాధిస్తూ ఇద్దరూ అభిమానులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ అందించారు. అయితే, ఈ సిరీస్ ముగిసిన వెంటనే భారత్ –న్యూజిలాండ్ మధ్య ఐదు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RO-KO | న్యూజిలాండ్‌తో (New Zealand) జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఇవాళతో (జనవరి 18) ముగింపు దశకు చేరుకుంది. ఈ సిరీస్‌లో భారత సీనియర్ స్టార్‌లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ మరోసారి తమ క్లాస్‌ను నిరూపించారు.

అనుభవంతో కూడిన బ్యాటింగ్, కీలక సమయంలో పరుగులు సాధిస్తూ ఇద్దరూ అభిమానులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ అందించారు. అయితే, ఈ సిరీస్ ముగిసిన వెంటనే భారత్ –న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆ పొట్టి ఫార్మాట్‌లో రోహిత్ (Rohith Sharma), కోహ్లీలు కనిపించ‌రు. దీంతో వారిద్ద‌రు కొంతకాలం పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉండబోతున్నారు.

RO-KO | టీ20ల్లో యువకులదే బాధ్యత

వన్డే సిరీస్ అనంతరం జనవరి 21 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కు భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. కారణం ఈ ఇద్దరూ ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశారు. దాంతో కివీస్‌తో జరిగే ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో యువ ఆటగాళ్లే జట్టును ముందుండి నడిపించనున్నారు. ప్రస్తుతం రోహిత్, కోహ్లీలు టెస్టులు, వన్డేలకే పరిమితమయ్యారు. అయితే బీసీసీఐ రూపొందించిన 2026 షెడ్యూల్ ప్రకారం.. న్యూజిలాండ్ సిరీస్ తర్వాత భారత జట్టుకు వెంటనే మరో వన్డే సిరీస్ లేదు. తదుపరి వన్డే అసైన్‌మెంట్ జూన్ 2026లో ఆఫ్ఘనిస్తాన్ పర్యటనతో ప్రారంభం కానుంది. అంటే దాదాపు ఐదు నుంచి ఆరు నెలల పాటు ఈ ఇద్దరు సీనియర్లు వన్డేల్లోనూ కనిపించకపోవచ్చు.

ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికలుగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 (ICC T20 World Cup 2026) జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత్ బరిలోకి దిగుతున్నప్పటికీ, టీ20లకు వీరిద్దరూ రిటైర్ Retire కావడంతో ఆ మెగా టోర్నీలో రోహిత్–కోహ్లీ జంట కనిపించదు. ఇది అభిమానులకు కొంత నిరాశ కలిగించే అంశమే. అయితే ఇప్పుడు వారి ల‌క్ష్యం మాత్రం 2027 వన్డే ప్రపంచకప్‌పైనే ఉంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ వ్యూహం ప్రకారం రోహిత్, కోహ్లీ అనుభవాన్ని ఆ మెగా ఈవెంట్‌కు సిద్ధం చేయాలనే ఉద్దేశంతో వారి పనిభారాన్ని తగ్గిస్తున్నారు. అందుకే పరిమిత సిరీస్‌లలో మాత్రమే వారిని ఆడించాలని బోర్డు భావిస్తోంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...