Supreme Court | మీకు ఇదే చివరి అవకాశం.. స్పీకర్​పై సుప్రీంకోర్టు ఆగ్రహం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Supreme Court | ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్కు ఇదే చివరి అవకాశమని ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్​ఎస్​ (BRS)నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ గూటికి చేరిన విషయం తెలిసిందే. దీనిపై గులాబీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారిపై అనర్హత వేటు వేయాలని కోరింది. దీనిపై గతంలో విచాణ చేపట్టిన న్యాయస్థానం మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్​ను ఆదేశించింది. ఆ గడువు అక్టోబర్​ 31తో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Supreme Court | ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్కు ఇదే చివరి అవకాశమని ఆగ్రహం వ్యక్తం చేసింది.

బీఆర్​ఎస్​ (BRS)నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ గూటికి చేరిన విషయం తెలిసిందే. దీనిపై గులాబీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారిపై అనర్హత వేటు వేయాలని కోరింది. దీనిపై గతంలో విచాణ చేపట్టిన న్యాయస్థానం మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్​ను ఆదేశించింది. ఆ గడువు అక్టోబర్​ 31తో ముగిసింది. అయినా స్పీకర్​ ఇప్పటి వరకు ఏడుగురి అనర్హత పిటిషన్లపై మాత్రమే తీర్పు చెప్పారు.

Supreme Court | వారికి క్లీన్​చిట్​

సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును శుక్రవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం విచారించింది. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు చెప్పారు. ఆ ఏడుగురు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్లు కొట్టేశారు. అయితే మరో ముగ్గురిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి (MLA Pocharam Srinivas Reddy), కాలే యాదయ్యకు గురువారం స్పీకర్​ క్లీన్ చిట్ ఇచ్చారు. వారు బీఆర్​ఎస్​లోనే ఉన్నట్లు తెలిపారు.

Supreme Court | కీలక పరిణామాలు ఉంటాయి

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ (MLA Danam Nagender), స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari) పిటిషన్లపై స్పీకర్​ ఇంతవరకు విచారణ జరపలేదు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై విచారణ పూర్తయిన ఇంకా స్పీకర్​ తీర్పు ప్రకటించలేదు. వీరి అనర్హత పిటిషన్లపై సైతం నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని వ్యాఖ్యలు చేసింది. నిర్ణయం తీసుకోకుంటే కీలక పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోని అఫిడవిట్​ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...