Kamareddy | కామారెడ్డిలో దొంగల బీభత్సం.. ఏకంగా ఐదు దుకాణాల్లో చోరీ

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.. ఏకంగా ఐదు దుకాణాల్లో చోరీలకు పాల్పడడం కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో చోరీల (thefts) కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడంలేదు. దొంగలు తరచూ ఎక్కడో ఒకచోట చోరీలకు పాల్పడుతున్నారు. Kamareddy | కామారెడ్డి పట్టణంలో.. పట్టణంలో (Kamareddy town) గురువారం అర్ధరాత్రి తర్వాత దుండగులు ఏకంగా ఐదు దుకాణాలలో చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని భగత్ సింగ్ నగర్​లో జిరాక్స్ షాప్​, […]

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.. ఏకంగా ఐదు దుకాణాల్లో చోరీలకు పాల్పడడం కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో చోరీల (thefts) కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడంలేదు. దొంగలు తరచూ ఎక్కడో ఒకచోట చోరీలకు పాల్పడుతున్నారు.

Kamareddy | కామారెడ్డి పట్టణంలో..

పట్టణంలో (Kamareddy town) గురువారం అర్ధరాత్రి తర్వాత దుండగులు ఏకంగా ఐదు దుకాణాలలో చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని భగత్ సింగ్ నగర్​లో జిరాక్స్ షాప్​, ఆన్​లైన్​, బ్యాంగిల్ స్టోర్​తో పాటు కొత్త బస్టాండ్ ఏరియాలోని ప్రియా డీలక్స్ రోడ్డులో రెండు మొబైల్ దుకాణాల షట్టర్లను పగులగట్టి భారీగా నగదు, వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ ఐదు దుకాణాల్లో సుమారు రూ.5 లక్షల వరకు నగదు, వివిధ వస్తువులు దుండగులు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే బాధిత షాపుల యజమానులు దుకాణాలకు వెళ్లగా షట్లర్లు పగులగొట్టి ఉండడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related articles

Anil Ambani ED | ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయనపై మనీలాండరింగ్​ కేసు నమోదైన విషయం తెలిసిందే.

Road Safety Tax | కొత్త వాహనాలు కొనేవారికి షాక్​.. పెరగనున్న రేట్లు

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై భద్రత పన్ను విధించనుంది. దీంతో ఆయా వాహనాల రేట్లు పెరగనున్నాయి.

Ankit IAS Transfer | నిజామాబాద్​ అదనపు కలెక్టర్ అంకిత్​​ బదిలీ..

రాష్ట్రవ్యాప్తంగా 45 మంది ఐఏఎస్​ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Bijapur Maoist Encounter | బీజాపూర్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు మావోయిస్టుల మృతి

ఛత్తీస్​గఢ్​ జిల్లా బీజాపూర్​లో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.