Road Safety Tax | కొత్త వాహనాలు కొనేవారికి షాక్​.. పెరగనున్న రేట్లు

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై భద్రత పన్ను విధించనుంది. దీంతో ఆయా వాహనాల రేట్లు పెరగనున్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Road Safety Tax | వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్​ ఇచ్చింది. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై భద్రత పన్ను విధించనుంది. దీంతో ఆయా వాహనాల రేట్లు పెరగనున్నాయి.

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్​లో జీఎస్టీ సంస్కరణలు (GST Reforms) అమలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వాహనాల రేట్లు భారీగా తగ్గాయి. పలు వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18శాతానికి తగ్గించడంతో రేట్లు దిగి వచ్చాయి. దీంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో రేట్లు పెరగనున్నాయి.

Road Safety Tax | మార్చి 1 నుంచి..

కొత్త వాహనాలపై మార్చి 1 నుంచి రహదారి భద్రత పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనాల రకాలను బట్టి ఈ పన్ను రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు ఉండనుంది. ఇది వినియోగదారులపై పడనుంది. దీంతో రేట్లు పెరుగుతాయి. కొత్తగా విధించే ఈ పన్నుతో రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ (Telangana Transport Department) ఉత్తర్వులు జారీ ఏసింది. రోడ్డు భద్రతను మెరుగు పర్చడానికి ఈ పన్ను విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Road Safety Tax | పన్ను రేట్లు ఇలా..

ద్వి చక్ర వాహనాలపై రూ.రెండు వేల పన్ను విధించనున్నారు. తేలికపాటి వాహనాలపై రూ.5 వేలు, ఇతర వాహనాలపై రూ.10 వేల ట్యాక్స్​ అమలు చేయనున్నారు. కార్లు తేలికపాటి వాహనాల పరిధిలోకి రానుండగా.. 4 నుంచి 7 సీట్ల సామర్థ్యం ఉన్న ప్రయాణికుల ఆటోలు ఇతర వాహనాల పరిధిలోకి వస్తాయి. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్నును చెల్లించాల్సి ఉంటుందని రవాణా శాఖ స్పష్టం చేసింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...