Maoists | వారు మాతోనే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన లేఖ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు మరో సంచలన ప్రకటన చేశారు. అగ్రనేతలు దేవ్​జీ, రాజిరెడ్డి తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు మావోయిస్టు వికల్ప్‌ (Maoist Vikalp) పేరుతో శుక్రవారం లేఖ విడుదల చేశారు. ఇటీవల జరిగిన ఎన్​కౌంటర్లలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందిన విషయం తెలిసిందే. అంతేగాకుండా పార్టీ పోలిట్​ బ్యూరో సభ్యుడు దేవ్​జీ పోలీసుల అదుపులో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. వారిని వెంటనే విడుదల చేయాలని మావోయిస్టులు సైతం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు మరో సంచలన ప్రకటన చేశారు. అగ్రనేతలు దేవ్​జీ, రాజిరెడ్డి తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు మావోయిస్టు వికల్ప్‌ (Maoist Vikalp) పేరుతో శుక్రవారం లేఖ విడుదల చేశారు.

ఇటీవల జరిగిన ఎన్​కౌంటర్లలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందిన విషయం తెలిసిందే. అంతేగాకుండా పార్టీ పోలిట్​ బ్యూరో సభ్యుడు దేవ్​జీ పోలీసుల అదుపులో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. వారిని వెంటనే విడుదల చేయాలని మావోయిస్టులు సైతం లేఖ విడుదల చేశారు. దేవ్​జీపాటు మరో 50 మంది నక్సల్స్ (Naxals)​ను పోలీసులు పట్టుకున్నారని అందులో పేర్కొన్నారు. అయితే తాజాగా దేవ్​జీ తమతోనే ఉన్నారని వారు క్లారిటీ ఇచ్చారు.

Maoists | అది అవాస్తవం

హిడ్మా (Madvi Hidma) సమాచారాన్ని దేవ్‌జీ చెప్పారనడం అవాస్తవమని లేఖలో పేర్కొన్నారు. చికిత్స కోసం హిడ్మా విజయవాడ వెళ్లాడన్నారు. హిడ్మా ఎన్​కౌంటర్​కు నలుగురు వ్యక్తులే కారణమని ఆరోపించారు. కోసాల్ అనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నీచర్​ వ్యాపారి, కాంట్రాక్టర్​ హిడ్మాను పోలీసులకు పట్టించారన్నారు. అక్టోబరు 27న చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్లారని వికల్ప్​ లేఖలో పేర్కొన్నారు. అనంతరం పోలీసులు హిడ్మాను పట్టుకొని బూటకపు ఎన్​కౌంటర్​ (Encounter) చేశారని ఆరోపించారు. తాము లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని స్పష్టం చేశారు. మారేడుమిల్లి (Maredumilli) ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని లేఖలో పేర్కొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...