New rules | నేటి నుంచి మారనున్న నిబంధనలివే..!

అక్షరటుడే, న్యూఢిల్లీ: మే 1 నుంచి అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇది మన జేబుపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. బ్యాంకు ఖాతా నుంచి ఏటిఎం లావాదేవీలు, వంట గ్యాస్ ధర వరకు ప్రతిదీ వీటితో ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త నిబంధనల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. New rules | ఏటీఎం మనీ డ్రా ఖరీదైనది ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా చేయడంపై ఉచిత పరిమితి ముగిసింది. ఇకపై ఏటీఎం నుంచి డబ్బు […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: మే 1 నుంచి అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇది మన జేబుపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. బ్యాంకు ఖాతా నుంచి ఏటిఎం లావాదేవీలు, వంట గ్యాస్ ధర వరకు ప్రతిదీ వీటితో ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త నిబంధనల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

New rules | ఏటీఎం మనీ డ్రా ఖరీదైనది

ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా చేయడంపై ఉచిత పరిమితి ముగిసింది. ఇకపై ఏటీఎం నుంచి డబ్బు తీసుకునే ప్రతిసారి రూ.19 చెల్లించాలి. గతంలో ఈ రుసుము రూ. 17 గా ఉండేది. దీనితో పాటు, బ్యాలెన్స్ చెక్ చేసినా రూ. 7 రుసుము చెల్లించాల్సిందే. గతంలో ఈ రుసుము రూ. 6 గా ఉండేది.

New rules | రైల్వే టికెట్ బుకింగ్‌ లో మార్పులు

రైల్వే టిక్కెట్ బుకింగ్(Railway ticket booking) నియమాలలో కొన్ని మార్పులు జరిగాయి. ఇకపై వెయిటింగ్ టిక్కెట్లు జనరల్ కోచ్‌లలో మాత్రమే చెల్లుబాటు అవుతాయి. స్లీపర్ కోచ్‌లో వెయిటింగ్ టికెట్‌తో ప్రయాణించడం కుదరదు.

New rules | RRB పథకం అమలు

దేశంలోని 11 రాష్ట్రాల్లో ‘వన్ స్టేట్ వన్ ఆర్‌ఆర్‌బి’ పథకం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. దీని మీనింగ్​.. ప్రతి రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కలిసి ఒక పెద్ద బ్యాంకుగా రూపాంతరం చెందుతాయి. దీనివల్ల బ్యాంకింగ్ సేవలు మెరుగుపడతాయని చెబుతున్నారు. ఈ మార్పు ఉత్తర్​ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్మూకశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌ లో అమలవుతుంది.

New rules | ఎల్‌పీజీ సిలిండర్ ధరలో మార్పు

ప్రతి నెల మొదటి తేదీన ఎల్‌పీజీ సిలిండర్ ధరలను(LPG Cylinder price) సమీక్షిస్తారు. ఈసారి నేడు(మే 1న) కూడా గ్యాస్ సిలిండర్ ధరను సమీక్షించనున్నారు. ఈ ధర మన జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోలేదు.

New rules | ఎఫ్‌డీ (FD), పొదుపు ఖాతా వడ్డీ రేట్లలో మార్పులు

నేటి నుంచి FD, సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లలో(Saving account interest rates) మార్పులు ఉంటాయి. ఆర్బీఐ రెపో రేటును రెండుసార్లు తగ్గించాక, చాలా బ్యాంకులు తమ ఖాతాదారుల పొదుపు ఖాతాలు, ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు తగ్గించాయి.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...