Homeతాజావార్తలుBandi Sanjay | పార్టీలో ఎవరితో విభేదాలు లేవు.. బండి సంజయ్​ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay | పార్టీలో ఎవరితో విభేదాలు లేవు.. బండి సంజయ్​ కీలక వ్యాఖ్యలు

పార్టీలో తనకు ఎవరితో అభిప్రాయ బేధాలు లేవని బండి సంజయ్​ అన్నారు. పార్టీ బలోపేతం కోసం తాను కృషి చేస్తానని పేర్కొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay | పార్టీలో తనకు ఎవరితో అభిప్రాయ బేధాలు, విభేదాలు లేవని కేంద్ర మంత్రి బండి సంజయ్​ (Union Minister Bandi Sanjay) తెలిపారు. బీజేపీ నేతల మధ్య అభిప్రాయ భేదాలు అనే వార్తలు అవాస్తవమన్నారు. కాగా బండి సంజయ్​, ఈటల రాజేందర్ (Etala Rajender) మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

తాను పార్టీ సిద్ధాంతం, బలోపేతం కోసం పని చేస్తానని బండి సంజయ్​ స్పష్టం చేశారు. పార్టీ ఏది చెబితే తాను అది చేస్తానన్నారు. పార్టీ కార్యకర్తల కోసం పని చేస్తానని తెలిపారు. తనపై ఎవరికైనా అభిప్రాయ భేదాలు ఉంటే తీసేయాలన్నారు. తన గురించి, పార్టీ గురించి మంచిగా ఆలోచించాలని సూచించారు.

Bandi Sanjay | రాష్ట్రంలో ఆర్​కే పాలన

తెలంగాణలో రేవంత్​రెడ్డి (Revanth Reddy), కేటీఆర్​ (KTR) (ఆర్​కే) పాలన సాగుతోందని కేంద్ర మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. అధికారంలోకి రాకముందు కేసీఆర్​ కుటుంబాన్ని జైలులో వేస్తానని, అక్రమంగా సంపాదించిన ఆస్తులు రికవరీ చేస్తానని రేవంత్​రెడ్డి అన్నట్లు గుర్తు చేశారు. ఇప్పుడు కనీసం ఆ కుటుంబంలో ఒక్కరికి కూడా టచ్​ చేయడం లేదని విమర్శించారు.

ఫార్మూల ఈ రేసు కేసులో గవర్నర్​ ఆమోదం రాకపోవడంతో ఇన్ని రోజులు బీజేపీని బద్నాం చేశారన్నారు. ఇప్పడు గవర్నర్​ అనుమతి వచ్చిందని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. రేవంత్​రెడ్డి గవర్నర్​ అనుమతి రావొద్దని కోరుకున్నట్లు వ్యాఖ్యానించారు. అలా అయితే బీజేపీని బద్నాం చేయొచ్చని చూశారన్నారు. ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్​ను సీఎం ఏం చేస్తారో చెప్పాలన్నారు. ఇటీవల దేవుడిపై నమ్మకం లేదని దర్శకుడు రాజమౌళి (director Rajamouli) చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఎవరి ఆలోచన వారిదన్నారు. భవిష్యత్తులో రాజమౌళి దేవుడిని నమ్మే విధంగా ఆ దేవుడి కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు.