Group-1 Exam | గ్రూప్​–1పై తీర్పు వాయిదా.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Group-1 Exam | గ్రూప్​–1 నియామకాలపై హైకోర్టు (High Court) తీర్పు వాయిదా వేసింది. దీంతో ఉద్యోగాలు సాధించిన వారితో పాటు అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం (State Government) గతంలో గ్రూప్​–1 పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సింగిల్​ బెంచ్​ ధర్మాసనం పరీక్షలను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై గ్రూప్​–1 ర్యాంకర్లు, టీజీపీఎస్సీ (TGPSC) డివిజన్​ బెంచ్​ను ఆశ్రయించాయి. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Group-1 Exam | గ్రూప్​–1 నియామకాలపై హైకోర్టు (High Court) తీర్పు వాయిదా వేసింది. దీంతో ఉద్యోగాలు సాధించిన వారితో పాటు అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

రాష్ట్ర ప్రభుత్వం (State Government) గతంలో గ్రూప్​–1 పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సింగిల్​ బెంచ్​ ధర్మాసనం పరీక్షలను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై గ్రూప్​–1 ర్యాంకర్లు, టీజీపీఎస్సీ (TGPSC) డివిజన్​ బెంచ్​ను ఆశ్రయించాయి. సింగిల్​ బెంచ్​ తీర్పుపై స్టే విధించిన ధర్మాసనం.. తుది తీర్పు మేరకు నియామకాలు జరగాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే విచారణ ముగియడంతో గురువారం తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే తీర్పు ఇంకా రెడీ కాలేదని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. ఇవాళ వెలువరించాల్సిన తీర్పును వచ్చేనెల 5కు వాయిదా వేసింది.

Group-1 Exam | తొలిసారి పరీక్షలు

తెలంగాణ (Telangana) ఏర్పాటు అయిన తర్వాత తొలిసారి గ్రూప్​–1 పరీక్షలు జరిగాయి. 2024 జూన్​లో పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఫలితాలు ప్రకటించి మెయిన్స్​ కోసం అభ్యర్థులను ఎంపిక చేశారు. మెయిన్స్ పరీక్షలు 2024 అక్టోబరు 21 నుంచి 27 వరకు జరిగాయి. 2025 మార్చి 10న వీటి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే కొందరు అభ్యర్థులు మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని కోర్టును ఆశ్రయించారు. దీంతో సింగిల్​ బెంచ్​ పరీక్షలను రద్దు చేయగా.. డివిజన్​ బెంచ్​ ఆ తీర్పుపై స్టే విధించింది.

Group-1 Exam | 563 మంది భవితవ్యం

గ్రూప్​–1 ఫలితాలపై ద్విసభ్య ధర్మాసనం స్టే విధించడంతో ప్రభుత్వం హడావుడిగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించింది. దీంతో 563 మంది కొలువులు సాధించారు. అయితే డివిజన్​ బెంచ్​ తుది తీర్పు మేరకు నియామకాలు ఉండాలని స్పష్టం చేసింది. దీంతో తన తీర్పులో పరీక్షను రద్దు చేస్తే నియామక పత్రాలు పొందిన వారి కొలువులు పోనున్నాయి. దీంతో న్యాయస్థానం తీర్పు కోసం నియామక పత్రాలు అందుకున్న వారితో పాటు నిరుద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...