Jubilee Hiils By Election | జూబ్లీహిల్స్ ఎన్నికకు ముహూర్తం ఖరారు.. నవంబర్ 11న ఉప ఎన్నిక, 14న కౌంటింగ్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hiils By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు వెల్లడించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువరించిన కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission).. 7 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారు చేసింది. తెలంగాణతో పాటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, మిజోరం, ఒడిశాలోని ఎనిమిది నియోజకవర్గాలకు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hiils By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువరించిన కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission).. 7 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారు చేసింది. తెలంగాణతో పాటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, మిజోరం, ఒడిశాలోని ఎనిమిది నియోజకవర్గాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.

Jubilee Hiils By Election | 13న నోటిఫికేషన్

జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)కు సంబంధించి అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్‌ 20 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, 24 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌(Election Commissioner Gyanesh Kumar) తెలిపారు. నవంబర్ 11న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. అదే నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి, ఫలితం వెల్లడిస్తామన్నారు.

Jubilee Hiils By Election | 407 పోలింగ్ కేంద్రాలు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో 2,07,367 మంది పురుష ఓటర్లు, 1,91,590 మంది మహిళా ఓటర్లు ఉన్నారని పేర్కొంది. వీరందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. పూర్తి పారదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని తెలిపింది. ఈసారి ఈవీఎంలపై పార్టీల గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటోలను కలర్ లో ముద్రించనున్నట్లు పేర్కొంది. అలాగే, ఫాంట్ సైజ్ కూడా ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...