Supreme Court | స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Supreme Court | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​ (Speaker Gaddam Prasad)కు సోమవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కారణ పిటిషన్​పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పది మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే (BRS MLA)లు కాంగ్రెస్​లో చేరిన విషయం తెలిసిందే. వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్​ఎస్​ స్పీకర్​ను కోరింది. ఆయన స్పందించపోవడంతో ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే మూడు నెలల్లో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Supreme Court | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​ (Speaker Gaddam Prasad)కు సోమవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కారణ పిటిషన్​పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో పది మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే (BRS MLA)లు కాంగ్రెస్​లో చేరిన విషయం తెలిసిందే. వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్​ఎస్​ స్పీకర్​ను కోరింది. ఆయన స్పందించపోవడంతో ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్​ను కోర్టు ఆదేశించింది. ఆ గడువు ముగిసినా.. స్పీకర్​ నిర్ణయం తీసుకోలేదు. దీంతో గతంలో కేటీఆర్​ (KTR) స్పీకర్​పై కోర్టు ధిక్కరణ పిటిషన్​ వేశారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి (BJP MLA Maheshwar Reddy) సైతం పిటిషన్​ వేశారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన ధర్మాసనం స్పీకర్​కు నోటీసులు జారీ చేసింది.

Supreme Court | క్లీన్​చీట్ ఇవ్వడంపై..

సుప్రీం కోర్టు తీర్పు మేరకు స్పీకర్​ ప్రసాద్​ విచారణ చేపట్టారు. 8 మంది ఎమ్మెల్యేలను విచారించి ఏడుగురికి క్లీన్​ చిట్​ ఇచ్చారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. వారిపై అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. దానం నాగేందర్ (Danam Nagender)​, కడియం శ్రీహరి, సంజయ్​కుమార్​ పిటిషన్లు పెండింగ్​లో ఉన్నాయి. ఇటీవల వీటిపై విచారణ చేపట్టిన కోర్టు చివరి అవకాశం ఇస్తున్నామని ఆ ముగ్గురి విషయంలో సైతం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే తాజాగా మహేశ్వర్​రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీంతో ఇదే కేసులో కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్​తో ఈ పిటిషన్‌ను జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం స్పీకర్​కు నోటీసులు జారీ చేసి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...