Mla Rakesh reddy | రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోంది: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

అక్షరటుడే, ఆర్మూర్: Mla Rakesh reddy | రాష్ట్రంలో రెండేళ్ల నుంచి కాంగ్రెస్​ ప్రభుత్వ పాలన దుర్మార్గంంగా సాగుతోందని ఆర్మూర్​ ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఇందిరాపార్క్​లో ఏర్పాటు చేసిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) సాగించిన రెండేళ్ల పాలనలో అవినీతి అక్రమాలే ఉన్నాయని దుయ్యబట్టారు. చివరికి హిందువులపై సైతం చులకనగా మాట్లాడే […]

అక్షరటుడే, ఆర్మూర్: Mla Rakesh reddy | రాష్ట్రంలో రెండేళ్ల నుంచి కాంగ్రెస్​ ప్రభుత్వ పాలన దుర్మార్గంంగా సాగుతోందని ఆర్మూర్​ ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఇందిరాపార్క్​లో ఏర్పాటు చేసిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) సాగించిన రెండేళ్ల పాలనలో అవినీతి అక్రమాలే ఉన్నాయని దుయ్యబట్టారు.

చివరికి హిందువులపై సైతం చులకనగా మాట్లాడే స్థాయికి సీఎం దిగజారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు రూ.2వేల కోట్ల భూములను అమ్ముకుంటున్నారన్నారు. రాష్ట్రంలో భూములన్నీ అమ్ముకుంటూ భవిష్యత్తు తరాలకు భూమి లేకుండా చేస్తూ కాంగ్రెస్​ పాలన సాగిస్తోందన్నారు.

సామాన్య ప్రజలకు పార్కులు కట్టాలంటే గుంట భూమి లేకుండా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని యువత ప్రజల ఆలోచించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే రాకష్​ రెడ్డి పేర్కొన్నారు. మహిళలకు రూ.300 ఇందిరమ్మ చీరలు ఇచ్చి, పెంచుతామన్న పింఛన్లు ఎగ్గొట్టారన్నారు. వృద్ధులు మహిళలు ఈ ప్రభుత్వం భరతం పట్టాలన్నారు. గత ప్రభుత్వం సగం భూములు అమ్మితే ఈ ప్రభుత్వ మొత్తం భూములను అమ్మేస్తుoదన్నారు. సిరిగల్ల తెలంగాణను ఒకడు తాకట్టు పెడితే, ఇప్పుడు వచ్చినోడు మొత్తం భూములను అమ్మేస్తున్నాడని విమర్శించారు.

ఈ దుర్మార్గాలను ఆపాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) బీజేపీని గెలిపించాలన్నారు. తెలంగాణలో సైతం బీజేపీ ఫార్మాట్​ మార్చాలన్నారు. మహారాష్ట్ర, బీహార్​లాగా తెలంగాణలో సైతం కాషాయ జెండా ఎగరాలన్నారు. తెలంగాణలో ఫార్మాట్ మార్చాలని గెలుపొందే సత్తా, దమ్ము ఉన్న వాళ్లకే అవకాశం ఇవ్వాలన్నారు. ఎన్ని మ్యాచ్​లు ఆడినం అన్నది ముఖ్యం కాదని గెలిచామా లేదా అన్నది ముఖ్యమన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలాగా రాష్ట్ర అధినాయకత్వం అడుగులు వేయాలన్నారు. తెలంగాణ సచివాలయంపై బీజేపీ జెండా ఎగరాలన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...