KTR | ప్రజల దృష్టి మరల్చడానికే సిట్​ ఏర్పాటు : కేటీఆర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | కాంగ్రెస్​ ప్రభుత్వంపై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ (KTR) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి , ప్రజల దృష్టి మరల్చడానికే సీఎం రేవంత్​రెడ్డి (Chief Minister Revanth Reddy) కమిషన్లు, సిట్​లు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. మంత్రితో ఐఏఎస్ అధికారి (IAS officer) ప్రేమ వ్యవహారం నడుపుతున్నారని ఇటీవల ఓ ఛానెల్​లో వార్త కథనం ప్రసారం అయిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తుకు ప్రభుత్వం సిట్ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | కాంగ్రెస్​ ప్రభుత్వంపై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ (KTR) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి , ప్రజల దృష్టి మరల్చడానికే సీఎం రేవంత్​రెడ్డి (Chief Minister Revanth Reddy) కమిషన్లు, సిట్​లు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.

మంత్రితో ఐఏఎస్ అధికారి (IAS officer) ప్రేమ వ్యవహారం నడుపుతున్నారని ఇటీవల ఓ ఛానెల్​లో వార్త కథనం ప్రసారం అయిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటుపై కేటీఆర్​ ఎక్స్​ వేదికగా స్పందించారు. పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో భాగంగా అధికార పక్షానికి దగ్గరగా ఉండే టీవీ చానెల్ మంత్రి కథనం వేసిందన్నారు. దాన్ని “ఉటంకించినందుకు” అనేక ఛానెళ్ల మీద, డిజిటల్ మీడియా (channels and digital media) హ్యాండిళ్ల మీద దర్యాప్తు చేయడానికి ఏకంగా సిట్ ఏర్పాటు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

వార్త వేసిన ఛానెల్ మీద చర్యలు తీసుకోక, సిట్ పేరు మీద ఈ కొత్త డ్రామాలు ఎందుకు అని ప్రశ్నించారు. ఎవరిని కాపాడటానికి ఈ సిట్ అన్నారు. ప్రజలు ప్రభుత్వ ఓవరాక్షన్ గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకలైన మీడియా, డిజిటల్ మీడియా సంస్థల మీద వేధింపులు ఆపకపోతే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

KTR | వాటిపై సిట్​ వేయాలి

కాంగ్రెస్ సర్కారులో ఒక మంత్రి పీఏ, రేవంత్ సహచరుడు కలిసి పారిశ్రామికవేత్తను తుపాకి పెట్టి డబ్బులు డిమాండ్​ చేశారని కేటీఆర్​ ఆరోపించారు. దాన్ని విచారణ చేయడానికి సిట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ములుగు జిల్లాలో మంత్రి పీఏ ఇసుక దందాలో కోట్లు దండుకుంటే సదరు ఇసుకాసురుల మీద కేసుల్లేవ్, సిట్ లేదన్నారు. రెవెన్యూ మంత్రి కొడుకు 70 మంది గూండాలను వెంటేసుకుని పోయి వందల కోట్ల భూ కబ్జాకు పాల్పడితే కేసు పెట్టిన పోలీసు అధికారిని బదిలీ చేశారని ఆరోపించారు. వాటిపై విచారణకు సిట్​ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...