Sim Binding | ఇక సిమ్​ ఉంటేనే ఆ యాప్​ల సేవలు.. కేంద్రం కీలక ఆదేశాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sim Binding | దేశంలో రోజురోజుకు సైబర్​ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కువ శాతం సైబర్​ క్రైమ్​లు (Cyber Crimes) టెలిగ్రాం, వాట్సాప్​ వంటి ప్లాట్​ఫామ్​ల ద్వారా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇక నుంచి సిమ్​ ఉంటేనే వాట్సాప్‌, టెలిగ్రామ్‌, అరట్టై, సిగ్నల్‌ వంటి కమ్యూనికేషన్‌ యాప్స్‌ పని చేసేలా నిబంధన తీసుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సిబ్​ బైండింగ్​ను తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఫోన్​పే (Phone […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sim Binding | దేశంలో రోజురోజుకు సైబర్​ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కువ శాతం సైబర్​ క్రైమ్​లు (Cyber Crimes) టెలిగ్రాం, వాట్సాప్​ వంటి ప్లాట్​ఫామ్​ల ద్వారా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇక నుంచి సిమ్​ ఉంటేనే వాట్సాప్‌, టెలిగ్రామ్‌, అరట్టై, సిగ్నల్‌ వంటి కమ్యూనికేషన్‌ యాప్స్‌ పని చేసేలా నిబంధన తీసుకు వచ్చింది.

కేంద్ర ప్రభుత్వం సిబ్​ బైండింగ్​ను తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఫోన్​పే (Phone Pay), గూగుల్​ పే  (Google Pay) వంటి యూపీఐ సేవలకు సిమ్​ బైండింగ్​ తప్పనసరి. ఫోన్​లో సిమ్​ ఉంటేనే యూపీఐ ద్వారా డబ్బులు పంపే వీలు ఉంటుంది. అయితే వాట్సాప్​, టెలీగ్రామ్​ వంటి యాప్​లకు ఒకసారి అకౌంట్​ తీసుకున్న తర్వాత సిమ్​ లేకున్నా.. సేవలు పొందవచ్చు. డివైజ్‌లో సిమ్‌ కార్డు ఉంటేనే యాప్‌ సర్వీసులను పనిచేసేలా చూడాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ఆయా సంస్థలను ఆదేశించింది. 90 రోజుల్లో ఈ నిబంధన అమలు చేయాలని పేర్కొంది.

Sim Binding | కొత్త నిబంధనలతో..

టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) సైబర్ సెక్యూరిటీ సవరణ నియమాలు నోటిఫై చేసిన తర్వాత సిమ్​ బైండింగ్​ తప్పనిసరి చేసింది. ఇది టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్ యూజర్ ఎంటిటీ (TIUE) వర్గాన్ని టెలికమ్యూనికేషన్ నిబంధనల పరిధిలోకి తీసుకువస్తుంది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, జోష్‌లకు పంపబడిన కొత్త ఆదేశాలు ఈ కంపెనీలను TIUEలుగా సమర్థవంతంగా గుర్తిస్తాయి. రాబోయే 90 రోజుల్లోపు సిమ్ కార్డులు తమ సేవలకు నిరంతరం లింక్ చేయబడి ఉండేలా చూసుకోవడానికి వారికి ప్లాట్‌ఫారమ్‌లు అవసరం. వెబ్‌సైట్ లేదా వెబ్-యాప్ ఆధారిత యాక్సెస్ కోసం వినియోగదారులు ఆరు గంటలలోపు లాగ్​ అవుట్​ అయ్యారని నిర్ధారించుకోవాలి. QR-కోడ్ ఆధారిత పద్ధతి ద్వారా ఖాతాలను తిరిగి లింక్ చేసే అవకాశం కల్పించాలి.

కస్టమర్ ధ్రువీకరణ కోసం మొబైల్ నంబర్‌లను ఉపయోగించే కొన్ని యాప్‌లు.. తర్వాత ఫోన్​లో సిమ్ లేనప్పుడు కూడా యాక్సెస్‌ను అనుమతిస్తాయని ప్రభుత్వం గమనించింది. ఇది భారతదేశం వెలుపల నుండి సైబర్ మోసానికి పాల్పడటానికి కారణం అవుతోందని గుర్తించింది. దీంతో సిమ్​ బైండింగ్​ను తప్పనిసరి చేసింది. ఇక నుంచి మొబైల్​ సిమ్​ తీసేస్తే ఆటోమేటిక్​గా వాట్సాప్​ నుంచి లాగౌట్​ అయిపోతుంది. మళ్లీ సిమ్​ వేశాక లాగిన్​ కావాల్సి ఉంటుంది.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...