Science Fair | అట్టహాసంగా ప్రారంభమైన సైన్స్​ఫేర్

అక్షరటుడే, కామారెడ్డి: Science Fair | కామారెడ్డి పట్టణంలోని విద్యానికేతన్ పాఠశాలలో (Vidyaniketan School)బుధవారం రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.  ప్రారంభోత్సవానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Incharge Minister Seethakka, ) హాజరవుతారని భావించినా అనివార్య కారణాలతో రాలేకపోయినట్టు సమాచారం. దాంతో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) కార్యక్రమాన్ని ప్రారంభించారు. Science Fair | రాష్ట్ర నలుమూలల నుంచి సైన్స్​ఫేర్ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ పాఠశాలలకు సంబంధించిన […]

అక్షరటుడే, కామారెడ్డి: Science Fair | కామారెడ్డి పట్టణంలోని విద్యానికేతన్ పాఠశాలలో (Vidyaniketan School)బుధవారం రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.  ప్రారంభోత్సవానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Incharge Minister Seethakka, ) హాజరవుతారని భావించినా అనివార్య కారణాలతో రాలేకపోయినట్టు సమాచారం. దాంతో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Science Fair | రాష్ట్ర నలుమూలల నుంచి

సైన్స్​ఫేర్ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ పాఠశాలలకు సంబంధించిన 1,700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సైన్స్ ఫేర్​లో 880  ప్రాజెక్ట్​లను విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థుల ప్రదర్శనలను షబ్బీర్ అలీ తిలకించారు. ప్రదర్శనలకు సంబంధించిన వివరాలను విద్యార్థులు అడిగారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఆవిష్కరణలు జరగాలన్నారు. విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు.

Science Fair | కాంగ్రెస్​ వచ్చాకే..

తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మిడ్​ డే మిల్ చార్జీలు 40శాతం, కాస్మోటిక్​ ఛార్జీలు(Cosmetic charges) 200శాతం పెంచిందని షబ్బీర్​ అలీ తెలిపారు. ఎంపీ సురేష్ షెట్కార్(MP Suresh Shetkar) మాట్లాడుతూ.. విద్యావ్యవస్థ బలపడాలంటే నూతన ఒరవడి అయిన ఏఐ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాటిలైట్ టెక్నాలజీ హైడ్రోజన్ ఎనర్జీ వంటి నూతన విధానాలకు ప్రేరణ కల్పించే విధంగా ఉపాధ్యాయులు బోధించాలన్నారు. అలాంటి ఆవిష్కరణలనే విద్యార్థులు చేసేలా ప్రోత్సహించాలన్నారు. అప్పుడే నూతన భారతం నిర్మితమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సృజనాత్మకత ప్రతి ఒక్క విద్యార్థుల్లోనూ ఉంటుందని దానిని వెలికితీసి సరైన మార్గంలో వారికి మార్గనిర్దేశం చేయడమే సైన్స్ ఉపాధ్యాయుల కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి, ఎన్​సీఆర్​టీ డైరెక్టర్ రమేష్, ఆర్జేడీ సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...