PM Modi Tour | శ్రీశైలంలో పర్యటించనున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్​ ఇదే..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi Tour | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఆంధ్ర ప్రదేశ్​ (AP)లోని కర్నూల్​ జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీశైలం (Srisailam) మల్లికార్జున స్వామి ఆలయంలో ఆయన పూజలు చేస్తారు. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్​ను పీఎంవో విడుదల చేసింది. ప్రధాని గురువారం (ఈ నెల 16న) ఉదయం 7.20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వస్తారు. ఉదయం 9.50 గంటలకు కర్నూలు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్​లో సున్నిపెంటకు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi Tour | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఆంధ్ర ప్రదేశ్​ (AP)లోని కర్నూల్​ జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీశైలం (Srisailam) మల్లికార్జున స్వామి ఆలయంలో ఆయన పూజలు చేస్తారు. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్​ను పీఎంవో విడుదల చేసింది.

ప్రధాని గురువారం (ఈ నెల 16న) ఉదయం 7.20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వస్తారు. ఉదయం 9.50 గంటలకు కర్నూలు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్​లో సున్నిపెంటకు వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 10:55కు శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్‌ హౌస్‌కు ప్రధాని చేరుకుంటారు. మల్లికార్జున స్వామి (Mallikarjuna Swamy)ని దర్శించుకుంటారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. మధ్యాహ్నం 1:20కి మళ్లీ భ్రమరాంబ గెస్ట్​ హౌస్​ నుంచి రోడ్డు మార్గంలో సున్నిపెంటకు వెళ్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు నన్నూరు గ్రామంలో జరిగే సమావేశంలో ఆయన ప్రసంగిస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 4:45 గంటలకు కర్నూల్ నుంచి తిరిగి ఢిల్లీకి పయనం అవుతారు.

PM Modi Tour | అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. కర్నూలు (Kurnool)లో సుమారు రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రూ.2,880 కోట్లతో చేపట్టనున్న కర్నూలు-3 పూలింగ్‌ స్టేషన్‌ని అనుసంధానించే ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఓర్వకల్‌, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో పనులకు, పాపాఘ్ని నదిపై నిర్మించిన వంతెనకు, ఎస్‌.గుండ్లపల్లి – కనిగిరి బైపాస్‌కు శంకుస్థాపన చేస్తారు.

PM Modi Tour | శ్రీశైలంలో ఆంక్షలు

ప్రధాని మోదీ శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకోనున్న నేపథ్యంలో అధికారులు ఆంక్షలు అమలు చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలు ఆలయం పరిసరాల్లో మోహరించాయి. శ్రీశైలం రహదారిపై సైతం ఆంక్షలు అమలులో ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం రాకపోకలు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌- శ్రీశైలం, దోర్నాల- శ్రీశైలం రహదారి మార్గాల్లో వాహన రాకపోకలను నిలిపివేస్తామని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...