CP Sai Chaitanya | మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేయడంలో పోలీసులదే కీలకపాత్ర: సీపీ

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : CP Sai Chaitanya | రాబోయే మున్సిపల్ ఎన్నికలను (Municipal Elections) శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో పోలీసులదే కీలక పాత్ర అని సీపీ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీపీ పోలీసులు అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగబోయే కార్పొరేషన్, మున్సిపల్​ ఎన్నికల్లో ఎటువంటి […]

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : CP Sai Chaitanya | రాబోయే మున్సిపల్ ఎన్నికలను (Municipal Elections) శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో పోలీసులదే కీలక పాత్ర అని సీపీ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీపీ పోలీసులు అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగబోయే కార్పొరేషన్, మున్సిపల్​ ఎన్నికల్లో ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి అధికారి, సిబ్బంది ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, ముందస్తు చర్యలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా చూడాలని చెప్పారు.

CP Sai Chaitanya | ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి

ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలని సిబ్బందికి సీపీ సూచించారు. సోషల్ మీడియా (Social Media) ద్వారా వ్యాపించే వదంతులను నియంత్రించడంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణే మన ప్రధాన లక్ష్యం కావాలని పేర్కొన్నారు.
ప్రతి అధికారి తన బాధ్యతను పూర్తిగా అర్థం చేసుకుని, సమన్వయంతో, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా, పోలీసు శాఖ (Police Department) ప్రతిష్ఠను మరింత పెంచేలా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు.

కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ(అడ్మిన్) బి.బస్వారెడ్డి, నిజామాబాద్​, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీశైలం, సీసీఆర్​బీ ఇన్​స్పెక్టర్​ ఆర్.అంజయ్య, ఎలక్షన్స్ సెల్ ఇన్​స్పెక్టర్​ వీరయ్య, సీఐలు, ఎస్​హెచ్​వోలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...