Kamareddy | తారుమారైన పేషెంట్ ఫైల్.. వైద్యుడి నిర్లక్ష్యంతో వృద్ధుడి మృతి

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | వైద్యుని నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ ఫైల్ వైద్యుడి నిర్లక్ష్యంతో తారుమారు కాగా.. ఇతరులు వాడాల్సిన మందు తాను వాడగా అవి వికటించి ఓ వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకోగా ఈ ఘటనలో ఆస్పత్రి వైద్యుడు, సిబ్బందిపై కేసు నమోదైనట్టు కామారెడ్డి (Kamareddy Police) సీఐ నరహరి (CI Narahari) తెలిపారు. Kamareddy | దోమకొండ మండలం సంగమేశ్వర్​కు […]

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | వైద్యుని నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ ఫైల్ వైద్యుడి నిర్లక్ష్యంతో తారుమారు కాగా.. ఇతరులు వాడాల్సిన మందు తాను వాడగా అవి వికటించి ఓ వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకోగా ఈ ఘటనలో ఆస్పత్రి వైద్యుడు, సిబ్బందిపై కేసు నమోదైనట్టు కామారెడ్డి (Kamareddy Police) సీఐ నరహరి (CI Narahari) తెలిపారు.

Kamareddy | దోమకొండ మండలం సంగమేశ్వర్​కు చెందిన..

సీఐ కథనం ప్రకారం.. దోమకొండ (Domakonda) మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన బాలరాజు (70) మూడేళ్ళుగా కిడ్నీ ఫెయిలై నరాల బలహీనత, బీపీ సమస్యలతో బాధపడుతున్నాడు. అప్పటినుంచి రెగ్యులర్​గా కామారెడ్డి పట్టణంలోని గీరెడ్డి రవీందర్ రెడ్డి హాస్పిటల్​లో చికిత్స తీసుకుంటున్నాడు. ఎప్పటిలాగే ఈనెల 17న ఆస్పత్రికి వచ్చిన బాలరాజు తన ఫైల్ తీసుకుని ఓపీ చూస్తున్న డా.నవీన్ వద్దకు వెళ్లగా ఆయన డా.రవీందర్ రెడ్డి దగ్గరికి తీసుకుని వెళ్లగా ఆయన మందులు రాసివ్వడంతో వాటిని తీసుకుని ఇంటికెళ్లాడు. అప్పటి నుంచి బాలరాజు ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది.

దీంతో మంగళవారం దోమకొండ ప్రభుత్వ ఆస్పత్రికి (Domakonda Government Hospital), అక్కడినుంచి తిరిగి గీరెడ్డి ఆస్పత్రికి తీసుకువచ్చారు. బాలరాజు ఫైల్ చూసిన వైద్యులు పొరపాటున ఫైల్ మారిందని, ఈ మందులు బాలరాజు వాడాల్సినవి కావని, షుగర్ లెవల్ పూర్తిగా తగ్గిందని మారిపోయిన ఫైల్​ను తిరిగి ఇచ్చారు. అయితే మందులు తీసుకుని ఇంటికి వెళ్లి వేసుకున్న తర్వాత తిరిగి రాత్రి 11:30 గంటలకు బాలరాజు ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చి అడ్మిట్ చేయించారు. రాత్రి ఒంటి గంటకు బాలరాజు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దాంతో ఫైల్ మార్చి వృద్ధుని మృతికి కారణమైన ఆస్పత్రి వైద్యుడు, సిబ్బందిపై పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వైద్యులు రవీందర్ రెడ్డి, నవీన్, రిషిప్షనిస్ట్ రక్షితపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...