అక్షరటుడే, ఇందూరు : MLA Dhanpal | మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Election) బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందనే భయంతోనే పాలకపక్షం ఓటర్ల జాబితాను తారుమారు చేసిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ దిలీప్ కుమార్ (Commissioner Dileep Kumar)తో మంగళవారం భేటీ అయ్యారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అక్రమాలు, పొరపాట్లపై చర్చించి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలో గల ఒక వార్డులోని ఓటర్లను కావాలనే మరో వార్డులోకి మార్చారని.. అర్హులైన వేలాదిమంది ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని ఆరోపించారు. స్థానిక అధికార ప్రతినిధి కనుసైగల్లోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి ముసాయిదాను తయారు చేయించాలని విమర్శించారు. ఎన్నికల్లో బీజేపీ (BJP) గెలుపు ఖాయమని సర్వేలు చెబుతుండడంతో ఓటమి భయంతో అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. క్షేత్రస్థాయిలో మరోసారి విచారణ జరిపి తప్పులను సరిదిద్దాలని తెలిపారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.
