Kalvakuntla kavitha | ఉద్యమకారులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలి: కవిత

అక్షరటుడే, బాన్సువాడ: Kalvakuntla kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తానని చెప్పి మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జనం బాటలో భాగంగా బాన్సువాడ మండలం కొయ్యగుట్ట అమరవీరుల స్థూపం (Koyyagutta Martyrs’ Stupa) వద్ద ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అనంతరం కొయ్యగుట్ట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల (Social Welfare […]

అక్షరటుడే, బాన్సువాడ: Kalvakuntla kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తానని చెప్పి మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జనం బాటలో భాగంగా బాన్సువాడ మండలం కొయ్యగుట్ట అమరవీరుల స్థూపం (Koyyagutta Martyrs’ Stupa) వద్ద ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నివాళులర్పించారు.

అనంతరం కొయ్యగుట్ట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల (Social Welfare Girls Gurukul School) సందర్శించి విద్యార్థినులతో ముచ్చటించారు. ఉద్యమకారులకు పింఛన్, గుర్తింపు కార్డులు ఇచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇవ్వకపోతే మరో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం హాస్టల్​ విద్యార్థులకు పెండింగ్ కాస్మొటిక్ ఛార్జీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల చందూర్ మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి మృతిపై ప్రభుత్వం పారదర్శకంగా విచారణ చేపట్టాలని కోరారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...