Minister Seethakka | కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: మంత్రి సీతక్క

అక్షరటుడే, భీమ్​గల్​: Minister Seethakka | రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క (Minister Seethakka) పేర్కొన్నారు. భీమ్​గల్​ పట్టణంలో (Bheemgal Municipality) రూ.55 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని వెల్లడించారు. Minister Seethakka | మహిళా […]

అక్షరటుడే, భీమ్​గల్​: Minister Seethakka | రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క (Minister Seethakka) పేర్కొన్నారు. భీమ్​గల్​ పట్టణంలో (Bheemgal Municipality) రూ.55 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని వెల్లడించారు.

Minister Seethakka | మహిళా సంక్షేమానికి పెద్దపీట

గడచిన రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు రూ.30వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందించామని మంత్రి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 60ఏళ్లు నిండిన మహిళలకు సంఘాల్లో సభ్యత్వం ఉండకూడదని ఆంక్షలు పెట్టిందని, కానీ తమ ప్రభుత్వం వయసుతో సంబంధం లేకుండా సభ్యత్వం కల్పించడమే కాకుండా బ్యాంకు ద్వారా బీమా సౌకర్యం కల్పిస్తోందని గుర్తుచేశారు. గత పాలకులు పదేళ్లలో మహిళలకు వడ్డీ రాయితీలు ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు.

Minister Seethakka | ప్రత్యేక నిధులతో భీమ్​గల్​ అభివృద్ధి

మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే, ముఖ్యమంత్రితో మాట్లాడి భీమ్​గల్​ పట్టణానికి మరిన్ని ప్రత్యేక నిధులు తీసుకువస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా, నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ సేవచేస్తున్న ముత్యాల సునీల్ కుమార్(Mutyala Sunil reddy) కార్యదక్షతను మంత్రి అభినందించారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో పెచ్చరిల్లిన గంజాయి సంస్కృతిని రూపుమాపి యువతను సన్మార్గంలో పెడుతున్నామని చెప్పారు. భీమ్​గల్​ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బోదిరే స్వామి, పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, నాయకులు కన్నె సురేందర్, మల్లెల లక్ష్మణ్, పర్శ అనంత్ రావు, వాక మహేష్, నాగేంద్రబాబు, సుంకరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...