Mla Madan Mohan | ఎల్లారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే మదన్​ మోహన్​

అక్షరటుడే ఎల్లారెడ్డి: Mla Madan Mohan | ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మదన్​ మోహన్​ అన్నారు. ఎల్లారెడ్డి (Yellareddy) పెద్ద చెరువుపై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ చేశారు. పెద్ద చెరువుపై (Pedda Cheruvu) జరుగుతున్న మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించారు. ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు మినీ ట్యాంక్ బండ్ (Mini tank bund) పనులను సకాలంలో పూర్తి చేస్తున్నట్లు […]

అక్షరటుడే ఎల్లారెడ్డి: Mla Madan Mohan | ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మదన్​ మోహన్​ అన్నారు. ఎల్లారెడ్డి (Yellareddy) పెద్ద చెరువుపై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ చేశారు.

పెద్ద చెరువుపై (Pedda Cheruvu) జరుగుతున్న మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించారు. ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు మినీ ట్యాంక్ బండ్ (Mini tank bund) పనులను సకాలంలో పూర్తి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాకింగ్ ట్రాక్ (Walking track), లైటింగ్, పార్క్, గార్డెన్, ఓపెన్ జిమ్, క్యాంటిన్, బోటింగ్ తదితర వసతులు కల్పించేందుకు రూ.3 కోట్ల ప్లాంటేషన్ పనుల కోసం నిధులు మంజూరయ్యాయన్నారు.

పట్టణ ప్రజలకు ఈ వసతులు అందుబాటులోకి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యాటకంతో ట్యాంక్​బండ్​కు కొత్తశోభ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఎల్లారెడ్డి బస్టాండ్​ను పరిశీలించారు. బస్టాండ్​లో ఏర్పాటుచేసిన క్యాంటీన్​లో కార్యకర్తలతో కలిసి టిఫిన్ చేశారు.

ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని హంగులతో బస్టాండ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నుంచి ఇతర ప్రాంతాలకు ట్రాన్స్​ఫర్​ చేసేందుకు ఏర్పాటుచేసిన పార్సిల్ సర్వీస్​ను సైతం ఆయన పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని వాళ్లకు సూచించారు. ఆయనతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...