RTI | జిల్లాను స.హ.చట్టం అమలులో ఆదర్శంగా నిలపాలి

అక్షరటుడే, ఇందూరు: RTI | సమాచార హక్కు చట్టాన్ని అన్ని ప్రభుత్వ శాఖలలో పక్కాగా అమలు చేస్తూ.. జిల్లాను ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. స.హ.చట్టం వారోత్సవాల్లో భాగంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో (Zilla Parishad) బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని బోధన్ (Bodhan), ఆర్మూర్(Armoor) డివిజన్ స్థాయిలో గురువారం తహశీల్దార్ల ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో శుక్రవారం అవగాహన […]

అక్షరటుడే, ఇందూరు: RTI | సమాచార హక్కు చట్టాన్ని అన్ని ప్రభుత్వ శాఖలలో పక్కాగా అమలు చేస్తూ.. జిల్లాను ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. స.హ.చట్టం వారోత్సవాల్లో భాగంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో (Zilla Parishad) బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని బోధన్ (Bodhan), ఆర్మూర్(Armoor) డివిజన్ స్థాయిలో గురువారం తహశీల్దార్ల ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టం గురించి అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

RTI | ప్రతి కార్యాలయంలో బోర్డులు ప్రదర్శించాలి

ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పౌర సమాచార అధికారి, సహాయ పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారి వివరాలతో బోర్డును విధిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అధికారులు మారిన సందర్భాల్లో వెంటనే ఆ సమాచారాన్ని అప్​డేట్​ చేయాలన్నారు. ఆర్​టీఐ (RTI) అమలుకు సంబంధించి తప్పనిసరిగా రిజిస్టర్​ను నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు వివరాలను పొందుపర్చాలని సూచించారు.

4(1బి) రిజిస్టర్​లోని సమాచారంతో కూడిన బుక్​లెట్​ను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి స.హ.చట్టం అమలుపై సమీక్ష జరపాలని ఆదేశించారు. దరఖాస్తులను నిర్ణీత కాలవ్యవధిలోపు పరిష్కరించాలని తెలిపారు. దరఖాస్తుదారు రెండో అథారిటీకి వెళ్లే ఆస్కారం లేకుండా కోరిన సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్​లో అందించాలన్నారు.

సమాచారం అందించే సమయంలో విచక్షణతో వ్యవహరిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్​ సూచించారు. అనవసర కాలయాపన చేస్తే జరిమానాలకు గురి కావాల్సి వస్తుందని.. ఇది పదోన్నతులు, ఇంక్రిమెంట్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు.

అనంతరం రిసోర్స్ పర్సన్లు కిషన్, కృష్ణాజీ స.హ.చట్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, జడ్పీ సీఈవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...