tomb of Sri Krishna Devaraya : శ్రీ కృష్ణ దేవరాయల సమాధిపై అపచారం..ఛీ ఇంత నీచమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: tomb of Sri Krishna Devaraya : దేశమే గర్వంగా చెప్పుకొనే గొప్ప చక్రవర్తుల్లో శ్రీ కృష్ణదేవరాయలు srikrishna devarayulu ముందు వరుసలో ఉంటారంటే అతిశయోక్తి కాదు. ప్రజా రంజకమైన పాలనను అందించి చరిత్రలో నిలిచిపోయిన గొప్ప రాజు. ఆయన మరణం తర్వాత అనెగొంది(Anegondi)లో సమాధి చేశారు. తుంగభద్రా నది(Tungabhadra River) ఒడ్డున దేవరాయల devarayala సమాధి మండపం ఉంది. 64 పిల్లర్లతో ఈ మండపం అద్భుతంగా నిర్మించారు. ఈ 64 పిల్లర్లు కూడా […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: tomb of Sri Krishna Devaraya : దేశమే గర్వంగా చెప్పుకొనే గొప్ప చక్రవర్తుల్లో శ్రీ కృష్ణదేవరాయలు srikrishna devarayulu ముందు వరుసలో ఉంటారంటే అతిశయోక్తి కాదు. ప్రజా రంజకమైన పాలనను అందించి చరిత్రలో నిలిచిపోయిన గొప్ప రాజు. ఆయన మరణం తర్వాత అనెగొంది(Anegondi)లో సమాధి చేశారు.

తుంగభద్రా నది(Tungabhadra River) ఒడ్డున దేవరాయల devarayala సమాధి మండపం ఉంది. 64 పిల్లర్లతో ఈ మండపం అద్భుతంగా నిర్మించారు. ఈ 64 పిల్లర్లు కూడా చదరంగంలోని 64 గడులకు గుర్తులుగా చెబుతుంటారు. జీవితమే చదరంగంగా పేర్కొంటూ ఈ ఆయన సమాధిని నిర్మించారంటారు.

అంతటి గొప్ప మహానుబావుడి సమాధికి రక్షణ లేకుండా పోతోంది. కొంతమంది దుర్మార్గులు శ్రీ కృష్ణదేవరాయల సమాధిపై నీచమైన పని చేస్తున్నారు. సమాధినే జంతు వధశాలగా మార్చేశారు. సమాధిపై మేక కోయడం వివాదాస్పదంగా మారింది.

సమాధిపైనే మేక కోసి, మాంసం ముక్కలుగా మార్చడాన్ని ఎవరో సెల్​ఫోన్​ చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్త వైరల్‌గా మారింది. విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్(Vijayapura MLA Basanagouda Patil) ఈ ఘటనపై స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు. విజయ నగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు దేశానికే గర్వకారణం.

అలాంటి ఆయన సమాధిని స్థానికులు మేకల మార్కెట్‌గా మార్చడం అత్యంత అవమానకరం. హిందూ దేవాలయాలను కూల్చిన ఔరంగజేబు(Aurangzeb) సమాధిని పురావస్తు శాఖ(Archaeological Department) రక్షిస్తోంది. కానీ, విజయనగర సామ్రాజ్యం కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన శ్రీ కృష్ణ దేవరాయల సమాధిని మాత్రం పట్టించుకోకపోవడం దారుణం’ అంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...