Municipal Elections | మున్సిపల్​ ఎన్నికలపై కాంగ్రెస్​ ఫోకస్​.. ఇన్​ఛార్జీల నియామకం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Municipal Elections | రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికల నగరా మోగనుంది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యుల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్​ పార్టీ (Congress Party) పురపోరుపై ఫోకస్​ చేసింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) కాంగ్రెస్​ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. మున్సిపాలిటీల్లో సైతం సత్తా చాటాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో మున్సిపల్​ ఎన్నికల కోసం పార్లమెంట్​ నియోజకవర్గాల వారీగా సీఎం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Municipal Elections | రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికల నగరా మోగనుంది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యుల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్​ పార్టీ (Congress Party) పురపోరుపై ఫోకస్​ చేసింది.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) కాంగ్రెస్​ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. మున్సిపాలిటీల్లో సైతం సత్తా చాటాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో మున్సిపల్​ ఎన్నికల కోసం పార్లమెంట్​ నియోజకవర్గాల వారీగా సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఇన్​ఛార్జీలను నియమించారు. మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.

Municipal Elections | ఇన్​ఛార్జీలు వీరే..

నిజామాబాద్‌ – ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఆదిలాబాద్ – సుదర్శన్‌ రెడ్డి, మల్కాజ్‌గిరి – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మెదక్‌ – వివేక్, చేవెళ్ల – శ్రీధర్‌బాబు, కరీంనగర్‌ – తుమ్మల నాగేశ్వరరావు, నల్గొండ – అడ్లూరి లక్ష్మణ్, పెద్దపల్లి – జూపల్లి కృష్ణారావు, భువనగిరి – సీతక్క, వరంగల్‌ – పొంగులేటి, మహబూబ్‌నగర్‌ – పొన్నం ప్రభాకర్‌, జహీరాబాద్‌ – అజహరుద్దీన్‌, మహబూబ్‌నగర్‌ – దామోదర రాజనర్సింహ, నాగర్‌కర్నూల్‌ – వాకిటి శ్రీహరి, ఖమ్మం బాధ్యతలను మంత్రి కొండా సురేఖ అప్పగించారు.

Municipal Elections | సన్నాహాక సమావేశాలు

ఇన్​ఛార్జీలుగా నియమితులైన వారు ఆయా పార్లమెంట్ పరిధిలో అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. మంగళవారం నుంచి పార్లమెంట్ సెగ్మెంట్లలో మున్సిపాలిటీల వారీగా సన్నాహక సమావేశాలు పెట్టాలని ఆదేశించారు. బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో చేరికలను ప్రోత్సహించాలన్నారు. సీఎం రేవంత్​రెడ్డి నేడు దావోస్​కు వెళ్లనున్నారు. ఆయన ఫిబ్రవరి 1న హైదరాబాద్​కు తిరిగి వస్తారు. ఆ లోగా పుర పోరుకు సంబంధించి నోటిఫికేషన్​ వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్​ విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది. దీంతో మెజారిటీ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకునేలా కాంగ్రెస్​ ప్రణాళికలు రచిస్తోంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...